Love Jihad: హిందూ అమ్మాయిలే టార్గెట్, పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ గ్యాంగ్..
- ఉత్తర్ ప్రదేశ్లో పట్టుబడిన ‘‘లవ్ జిహాద్’’ ముఠా..
- హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ బలవంతపు మతమార్పిడి..
- అమ్మాయి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన గ్యాంగ్..
- ఇద్దరు మహిళలతో సహా 8 మంది అరెస్ట్..
Love Jihad: ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.
ఫిర్యాదు రావడంతో స్థానిక పోలీసులు, సైబర్ సెల్ సంయుక్తంగా ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి బాలికను సురక్షితంగా రక్షించారు. పోలీసులు రెండు ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఒకదాంట్లో ఆమె పేరు నేహా శర్మగా, మరొక దాంట్లో మతం మార్చిన తర్వాత పర్వాణి ఖాటూన్ అనే పేరుతో ఉంది. 11 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Tariff Deadline: ‘‘ఆగస్టు 1 డెడ్ లైన్’’.. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ..
ఈ కేసుపై ఎస్పీ సంతోష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘‘మహువా బుజుర్గ్కు చెందిన సునీల్ వర్మ తన కుమార్తెను బలవంతంగా మతం మార్చారని ఫిర్యాదు చేశారు. ఇది ఒక వ్యవస్థీకృత నెట్వర్క్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశాము. అషిక్ అన్సారీ, ఇంతియాజ్, మొహమ్మద్ సహాబ్, మరికొందరు ఆమెను మతం మార్చి కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత దాచిపెట్టారు. తదుపరి విచారణ కొనసాగుతోంది’’ అని చెప్పారు.
అరెస్టు చేసిన వ్యక్తులను తౌఫిక్ అన్సారీ, ఆషిక్ అన్సారీ మరియు అతని కుమారుడు ఇంతియాజ్, మొహమ్మద్ సహబ్ అన్సారీ, జీషన్ ఖమర్, మజార్ మరియు ఇద్దరు మహిళలు, కైజర్ జహాన్, ఫాతిమాగా గుర్తించారు. ముఖ్యంగా హిందూ మహిళలను టార్గెట్ చేస్తూ మతం మార్చుతున్నట్లు విచారణలో తేలింది. ఈ ముఠా బాధితురాలని చాలా కాలంగా వెంబడించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రలోభాలకు గురి చేసి మోసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి తౌఫిక్ అన్సారీ కొన్ని వీడియోలు, రికార్డును ఉపయోగించాడు. కైజర్ జహాన్, ఫాతిమా ఆ బాలికను మానసికంగా మోసగించడంలో కీలక పాత్ర పోషించారని, ఆమె మతపరమైన విషయాలను చూపించి ఆమె నమ్మకాలను ప్రభావితం చేశారని ఆరోపించారు. పరారీలో ఉన్న ఇతర ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?