Kolkata Doctor Murder Case: కోల్కతా హస్పటల్ విధ్వంసం.. ఇద్దరు ఏసీపీలు, ఓ ఎస్ఐ సస్పెన్షన్..!
- కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో విధ్వంసం..
- ఇద్దరు ఏసీపీలు.. ఒక ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Doctor Murder Case: కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించారు. ఆ టైంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్కతా పోలీసు విభాగం ఇవాళ (ఆగస్ట్ 21) సస్పెండ్ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఘటన జరిగిన టైంలో హస్పటల్ దగ్గర విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్స్పెక్టర్పైన వేటు పడింది.
Read Also: Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
Also Read
- US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
- Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
కాగా, హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా ఆందోళనలు తెలుపుతుంటే.. మరోవైపు ముసుగులు ధరించిన కొందరు విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి దాడులు జరిపారు. అత్యవసర గది, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, ఔట్ పేషంట్ విభాగాలతో పాటు సీసీ టీవీలను కూడా పగలకొట్టారు. దాడికి పాల్పడిన వారిలో ఇప్పటి వరకూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సుమారు 40 మంది నిరసనకారుల రూపంలో అర్థరాత్రి వచ్చిన దుండగులు ఆసుపత్రిలో ఈ విధ్వంసం సృష్టించారు.. వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని పోలీసులు వెల్లడించారు.
Read Also: Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..
ఇక, ఈ విధ్వంసాన్ని నిలువరించటంలో పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు మంగళవారం జరిగిన విచారణలో పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఘటన జరిగిన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఆ టైంలో అక్కడే నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆరోపణలు చేశారు. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ సైతం తమవైపు తప్పు జరిగిందని మరుసటిరోజే తెలిపారు. దాడుల్లో పోలీసులు సైతం గాయపడ్డారని.. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యామని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
-
Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
-
US-India-Russia: చమురు విషయంలో రష్యా హామీ.. అమెరికా ముందు భారత్ కీలక డిమాండ్..
-
Monsoon Alert: భారతీయులకు శుభవార్త.. 5 రోజుల ముందే అండమాన్ను తాకనున్న తొలకరి జల్లు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?