Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. పిస్టల్ స్వాధీనం..
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
- పిస్టర్, మ్యాగజైన్స్ స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder Case: ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ నెపంతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ దారుణానికి ప్లాన్ చేసింది. ఈ హత్య కోసం ముగ్గురు హంతకులను నియమించుకున్నారు. మే 23న రఘువంశీ హత్య జరగగా, జూన్ 02న అతడి మృతదేహం మేఘాలయలోని తూర్పు కాసీ కొండల్లో గుర్తించారు. ఆ తర్వాత సోనమ్ ఈ హత్య కేసులో యూపీ ఘాజీపూర్ పోలీసులు ముందు లొంగిపోయింది. ప్రస్తుతం నిందితులంతా అరెస్టయ్యారు.
Read Also: Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
అయితే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం (సెట్) ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో రాజ రఘువంశీకి హత్యకు సంబంధించిన ఒక దేశీయ పిస్టల్, మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ మాట్లాడుతూ.. ఈ కేసులో మరో నిందితుడు ఆస్తి వ్యాపారి అయిన సిలోమ్ జేమ్స్ను విచారించినట్లు చెప్పారు. ఇతడి సమాచారం ఆధారంగా ఇండోర్ ఒక వాగు నుంచి 32 రౌండ్ల రెండు మ్యాగజైన్స్లతో పాటు ఒక దేశీయ తయారీ హ్యాండ్ గన్ని సిట్ స్వాధీనం చేసుకుంది.
పోలీసులు అతడి కారు నుంచి రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను రాజ్ కుష్వాహా ల్యాప్ లాప్ బ్యాగ్ నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాగ్ను తగలబెట్టి, ల్యాప్టాప్ను రోడ్డు పక్కన ఎక్కడో విసిరివేసినట్లు పోలీసులు తెలిపారు, దాని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మే 23న సోనమ్ తన భర్తను హత్య చేసిన తర్వాత ఇండోర్కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆభరణాలను మేఘాలయ సిట్ ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈ కేసులో ఆస్తి డీలర్తో సహా ముగ్గురిని సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ప్లాట్ యజమాని కేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డ్ బల్వీర్ ఉన్నారు. వీరిని గురువారం షిల్లాంగ్కు తీసుకువచ్చి స్థానిక కోర్టుకు తరలిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. తదుపరి విచారణ కోసం పోలీసులు వారి రిమాండ్ను కోరనున్నారు.
తాజావార్తలు
-
Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!