Honeymoon Murder Case: హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం.. పిస్టల్ స్వాధీనం..
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం..
- పిస్టర్, మ్యాగజైన్స్ స్వాధీనం..
Honeymoon Murder Case: ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ నెపంతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ దారుణానికి ప్లాన్ చేసింది. ఈ హత్య కోసం ముగ్గురు హంతకులను నియమించుకున్నారు. మే 23న రఘువంశీ హత్య జరగగా, జూన్ 02న అతడి మృతదేహం మేఘాలయలోని తూర్పు కాసీ కొండల్లో గుర్తించారు. ఆ తర్వాత సోనమ్ ఈ హత్య కేసులో యూపీ ఘాజీపూర్ పోలీసులు ముందు లొంగిపోయింది. ప్రస్తుతం నిందితులంతా అరెస్టయ్యారు.
Read Also: Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
అయితే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం (సెట్) ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో రాజ రఘువంశీకి హత్యకు సంబంధించిన ఒక దేశీయ పిస్టల్, మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ మాట్లాడుతూ.. ఈ కేసులో మరో నిందితుడు ఆస్తి వ్యాపారి అయిన సిలోమ్ జేమ్స్ను విచారించినట్లు చెప్పారు. ఇతడి సమాచారం ఆధారంగా ఇండోర్ ఒక వాగు నుంచి 32 రౌండ్ల రెండు మ్యాగజైన్స్లతో పాటు ఒక దేశీయ తయారీ హ్యాండ్ గన్ని సిట్ స్వాధీనం చేసుకుంది.
పోలీసులు అతడి కారు నుంచి రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను రాజ్ కుష్వాహా ల్యాప్ లాప్ బ్యాగ్ నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాగ్ను తగలబెట్టి, ల్యాప్టాప్ను రోడ్డు పక్కన ఎక్కడో విసిరివేసినట్లు పోలీసులు తెలిపారు, దాని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మే 23న సోనమ్ తన భర్తను హత్య చేసిన తర్వాత ఇండోర్కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆభరణాలను మేఘాలయ సిట్ ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈ కేసులో ఆస్తి డీలర్తో సహా ముగ్గురిని సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ప్లాట్ యజమాని కేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డ్ బల్వీర్ ఉన్నారు. వీరిని గురువారం షిల్లాంగ్కు తీసుకువచ్చి స్థానిక కోర్టుకు తరలిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. తదుపరి విచారణ కోసం పోలీసులు వారి రిమాండ్ను కోరనున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?