Biryani: మహిళ ప్రాణం తీసిన ‘‘బిర్యానీ’’.. ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani: కేరళలో బిర్యానీ ఓ మహిళ ప్రాణాలను తీసింది. వివారాల్లోకి వెళ్తే త్రిసూర్ జిల్లాలోని పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లోని బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వీరిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. కుటిలక్కడవ్కి చెందిన నుజైబా(56) బిర్యానీ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను స్థానికం ఉన్న ఆరోగ్య కేంద్రానికి అక్కడ నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించారు.
Read Also: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మరణానికి కారణాలపై శాస్త్రీయ పరిశోధన జరగనుంది. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో పోలీసులు,ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు స్పందించి రెస్టారెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయమై కయపమంగళం పోలీస్స్టేషన్, పెరింజనం పంచాయతీలో ఫిర్యాదు చేశారు. అదనంగా, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిని కలుసుకుని సమాచారాన్ని సేకరించారు.
రెస్టారెంట్లోని మయోనెస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడం వల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కైపమంగళానికి చెందినవారే. కేరళ ప్రభుత్వం 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా రాష్ట్రంలోని రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ను నిషేధించింది. కాసర్గోడ్కు చెందిన అంజు శ్రీపార్వతి అనే 20 ఏళ్ల యువతి రెస్టారెంట్లో మండి తిని మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!