Biryani: మహిళ ప్రాణం తీసిన ‘‘బిర్యానీ’’.. ఏం జరిగిందంటే..?
Biryani: కేరళలో బిర్యానీ ఓ మహిళ ప్రాణాలను తీసింది. వివారాల్లోకి వెళ్తే త్రిసూర్ జిల్లాలోని పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లోని బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వీరిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. కుటిలక్కడవ్కి చెందిన నుజైబా(56) బిర్యానీ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను స్థానికం ఉన్న ఆరోగ్య కేంద్రానికి అక్కడ నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించారు.
Read Also: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మరణానికి కారణాలపై శాస్త్రీయ పరిశోధన జరగనుంది. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో పోలీసులు,ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు స్పందించి రెస్టారెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయమై కయపమంగళం పోలీస్స్టేషన్, పెరింజనం పంచాయతీలో ఫిర్యాదు చేశారు. అదనంగా, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిని కలుసుకుని సమాచారాన్ని సేకరించారు.
రెస్టారెంట్లోని మయోనెస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడం వల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కైపమంగళానికి చెందినవారే. కేరళ ప్రభుత్వం 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా రాష్ట్రంలోని రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ను నిషేధించింది. కాసర్గోడ్కు చెందిన అంజు శ్రీపార్వతి అనే 20 ఏళ్ల యువతి రెస్టారెంట్లో మండి తిని మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!