Biryani: మహిళ ప్రాణం తీసిన ‘‘బిర్యానీ’’.. ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biryani: కేరళలో బిర్యానీ ఓ మహిళ ప్రాణాలను తీసింది. వివారాల్లోకి వెళ్తే త్రిసూర్ జిల్లాలోని పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లోని బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వీరిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. కుటిలక్కడవ్కి చెందిన నుజైబా(56) బిర్యానీ తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను స్థానికం ఉన్న ఆరోగ్య కేంద్రానికి అక్కడ నుంచి ఇరింజలకుడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతూ నుసైబా మంగళవారం మరణించారు.
Read Also: Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మరణానికి కారణాలపై శాస్త్రీయ పరిశోధన జరగనుంది. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో పోలీసులు,ఆరోగ్య శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రతినిధులు, పంచాయతీ అధికారులు, పోలీసులతో కలిసి రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై పంచాయతీ అధికారులు స్పందించి రెస్టారెంట్పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అపరిశుభ్రతతో హోటల్ నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ విషయమై కయపమంగళం పోలీస్స్టేషన్, పెరింజనం పంచాయతీలో ఫిర్యాదు చేశారు. అదనంగా, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిని కలుసుకుని సమాచారాన్ని సేకరించారు.
రెస్టారెంట్లోని మయోనెస్, కేరళలో ప్రసిద్ధి చెందిన బిర్యానీలాంటి యెమెన్ వంటకం ‘కుజి మండి’ తినడం వల్లే మహిళ మరణించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పెరింజనం, కైపమంగళానికి చెందినవారే. కేరళ ప్రభుత్వం 2023 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసుల కారణంగా రాష్ట్రంలోని రెస్టారెంట్లలో గుడ్లతో తయారు చేసిన మయోనైజ్ను నిషేధించింది. కాసర్గోడ్కు చెందిన అంజు శ్రీపార్వతి అనే 20 ఏళ్ల యువతి రెస్టారెంట్లో మండి తిని మరణించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!