దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం కేసులు భారీగా నమోదు అవుతూ వచ్చాయి.. ప్రస్తుతం అక్కడ కూడా కేసులు తగ్గుతూ వస్తున్నాయి… కేరళ సర్కార్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో వంద మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. తాజా కేసులు కలుపుకొని పాజిటివ్ కేసుల సంఖ్య 30,73,134కు చేరుకోగా.. ఇప్పటి వరకు 14,686 మంది మృతిచెందారు.. తాజాగా మరో 11,447 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 29,46,870కు పెరిగినట్టు బులెటిన్లో పేర్కొంది కేరళ ప్రభుత్వం.
కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు

COVID 19