Kerala: ” ఆజాద్ కాశ్మీర్ ” వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యేపై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala court orders police to book CPI(M) MLA Jaleel over ‘Azad Kashmir’ remark: జమ్మూా కాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని అక్కడి కోర్టు పోలీసులను ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని‘ ఇండియా ఆక్రమిత కాశ్మీర్ ’ అంటూ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కేటీ జలీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై కేరళ పతనంతిట్ట జిల్లాలోని సెషన్స్ కోర్ట్ ఆయన మీద కేసు పెట్టాలని ఆదేశించింది. ఇదే కాకుండా పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ‘ ఆజాద్ కాశ్మీర్ ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జలీల్ పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ పతనంతిట్ట అధ్యక్షడు అరణ్ మోహన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు చర్యలకు ఆదేశించింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. కోర్టు తీర్పుపై జలీల్ ఇంకా స్పందించలేదు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: USA: బైడెన్ పరిపాలనలో కీలక స్థానాల్లో ఇండో అమెరికన్స్..
ఎమ్మెల్యే జలీల్ ఇటీవల కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఆగస్టు 12న తన ఫేస్ బుక్ పోస్టులో కాశ్మీర్ గురించి వివరిస్తూ.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో విలీనం అయిన కాశ్మీర్ ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీర్ గా పిలిచే వారని.. ఇది పాకిస్తాన్ నియంత్రణలో లేని ప్రాంతం అని.. ఇదే విధంగా భారత్ ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ‘‘భారత్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్’’ అని ఇందులో కాశ్మీర్ లోయ, లడఖ్ ఉంటాయని వ్యాఖ్యానించారు.
దీంతో పాటు కాశ్మీర్ ప్రజలు నవ్వడాన్ని మరిచిపోయారని.. ఎందుకంటే ప్రతీ రోజూ ఆర్మీ సైనికులు ఉన్నారని.. కాశ్మీరీ ప్రజలు నవ్వడం మరిచిపోయిన మనుషులుగా మారారని వ్యాఖ్యానించాడు. ఆర్మీ ట్రక్కులు, మిలిటరీ కాశ్మీరీల రోజూవారీ జీవితంలో భాగంగా మారిందని.. కాశ్మీర్ లోని ప్రతీ ప్రాంతంలో ఒక రకమైన ఉదాసీనత దాగి ఉండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంపై ఏబీవీపీ కూడా తిరువనంతపురం పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. జలీల్ పై కేరళలో రెండు, ఢిల్లీలో రెండు కేసులు నమోదు అయ్యాయి. అయితే తన వ్యాఖ్యలను కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేదని..వారి పట్ల సానుభూతి ఉందని జలీల్ మరో పోస్ట్ పెట్టాడు. ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్ నాదన్ కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ కు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!