Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
- కేరళం సీఎం ఎంపికపై గందరగోళం
- రేసులోకి ముగ్గురు సీనియర్ నాయకులు
- ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడ లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక ఈజీగానే జరగొచ్చని అంతా భావించారు. తమిళనాడులో చోటుచేసుకున్నంత గందరగోళం లేకపోవచ్చని అనుకున్నారు. కానీ తమిళనాడు కంటే కేరళంలోనే పెద్ద తలనొప్పి నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు కీలక నేతలు రేసులోకి వచ్చారు. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం తలమునకలవుతోంది. తొలుత కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.
ఈ గందరగోళం మధ్య స్వయంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా కేసీ వేణుగోపాల్కే ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు వీడీ సతీశన్కు కేరళ స్థాయి కార్యకర్తల మద్దతు బలంగా ఉందని, ప్రియాంకా గాంధీ కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొనడంతో కాంగ్రెస్ హైకమాండ్ మాజీ కేరళ పీసీసీ అధ్యక్షులు వీఎం సుధీరన్, ముళ్లపల్లి రామచంద్రన్లతో చర్చలు ప్రారంభించింది. సీనియర్ నేత ఏకే.ఆంటోనీ కూడా ఈ ప్రక్రియలో కీలక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా వేణుగోపాల్, సతీశన్ అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ వార్, నిరసనలు, బహిరంగ మద్దతు ప్రదర్శనలు చేపట్టడం పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా సతీశన్కు అనుకూలంగా జరుగుతున్న దూకుడు ప్రచారం ఆయన అవకాశాలను దెబ్బతీసి ఉండొచ్చని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమై సీఎం ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. పార్టీ వర్గాల ప్రకారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్కు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
140 సభ్యుల కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా, ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే భారీ విజయాన్ని సాధించినప్పటికీ సీఎం ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు యూడీఎఫ్ విజయోత్సాహాన్ని మసకబార్చుతోంది.
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!