Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
- కేరళం సీఎం ఎంపికపై గందరగోళం
- రేసులోకి ముగ్గురు సీనియర్ నాయకులు
- ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడ లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక ఈజీగానే జరగొచ్చని అంతా భావించారు. తమిళనాడులో చోటుచేసుకున్నంత గందరగోళం లేకపోవచ్చని అనుకున్నారు. కానీ తమిళనాడు కంటే కేరళంలోనే పెద్ద తలనొప్పి నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం ముగ్గురు కీలక నేతలు రేసులోకి వచ్చారు. ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధిష్టానం తలమునకలవుతోంది. తొలుత కేసీ.వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అనంతరం సతీశన్, రమేష్ చెన్నితాల పేర్లు తెరపైకి రావడంతో పార్టీలో వర్గపోరు మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాక హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది.
ఈ గందరగోళం మధ్య స్వయంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా కేసీ వేణుగోపాల్కే ఉన్నట్లు గుర్తించింది. మరోవైపు వీడీ సతీశన్కు కేరళ స్థాయి కార్యకర్తల మద్దతు బలంగా ఉందని, ప్రియాంకా గాంధీ కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
- Congress: సంచలన నిర్ణయాలు దిశగా కాంగ్రెస్.. భారీ నాయకత్వ మార్పుల వైపు అడుగులు?
- Lalit Modi: 'ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు', సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొనడంతో కాంగ్రెస్ హైకమాండ్ మాజీ కేరళ పీసీసీ అధ్యక్షులు వీఎం సుధీరన్, ముళ్లపల్లి రామచంద్రన్లతో చర్చలు ప్రారంభించింది. సీనియర్ నేత ఏకే.ఆంటోనీ కూడా ఈ ప్రక్రియలో కీలక సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా వేణుగోపాల్, సతీశన్ అనుచరులు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ వార్, నిరసనలు, బహిరంగ మద్దతు ప్రదర్శనలు చేపట్టడం పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా సతీశన్కు అనుకూలంగా జరుగుతున్న దూకుడు ప్రచారం ఆయన అవకాశాలను దెబ్బతీసి ఉండొచ్చని కొందరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా సమావేశమై సీఎం ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. పార్టీ వర్గాల ప్రకారం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్కు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ఆయనకే ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
140 సభ్యుల కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 63 స్థానాలు దక్కించుకోగా, ముస్లిం లీగ్ 22 స్థానాలు, కేరళ కాంగ్రెస్ 8 స్థానాలు, విప్లవ సోషలిస్టు పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే భారీ విజయాన్ని సాధించినప్పటికీ సీఎం ఎంపికపై కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు యూడీఎఫ్ విజయోత్సాహాన్ని మసకబార్చుతోంది.
తాజావార్తలు
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!