LIC: వాటాల విక్రయానికి కేంద్రం నిర్ణయం.. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..!
ఎల్ఐసీ ఐపీవో ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఐపీవోకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ఐసీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్ఐసీని ప్రైవేటీకరించడం లేదని, ఐపీవో ద్వారా ఐదు శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోందని చెప్పారు విజయన్. ఇది ప్రైవేటీకరణకు తొలి అడుగు అని, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా అదేనన్నారు. ప్రైవేటు కంపెనీల దోపిడీ నుంచి పాలసీదారులను రక్షించేందుకే ఎల్ఐసీని జాతీయీకరించారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల వారికి కూడా బీమా చేరువైందంటే అది ఎల్ఐసీ చలవేనని అభిప్రాయపడ్డారు. అలాంటిది పార్లమెంట్లో ఎలాంటి చర్చా లేకుండా ఎల్ఐసీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని విమర్శించారు కేరళ సీఎం విజయన్.
Read Also: BJP: ధర్నా చౌక్లో బీజేపీ దీక్ష.. పోలీసుల అనుమతి..
Also Read
మరోవైపు.. కేంద్ర నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను తమకు చేతకాదని అమ్మేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీల్లో ఒకటైన ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం సిగ్గులేకుండా అమ్మేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. నష్టం వస్తే అమ్మాలి గానీ లాభాలు తెచ్చే సంస్థను భారత ప్రభుత్వం ఎందుకు అమ్మేస్తుందో మోడీ సమాధానం చెప్పాలని నిలదీశారు. అమెరికా బీమా కంపెనీలకు లాభం చేకూర్చేందుకా ఎల్ఐసీని అమ్మేస్తున్నారా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇక, ఎల్ఐసీలో 5 శాతం వాటాల విక్రయం కోసం కేంద్రం సెబీకి దరఖాస్తు చేసింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు రావాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య తరుణంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఐపీవో రాక ఆలస్యమవుతోంది.
- Tags
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!