Site icon NTV Telugu

సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌ అంశాన్ని పరిశీలించండి: కేజ్రీవాల్

సీనియర్‌ సిటిజన్లు బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్‌ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు.

అయితే ఇవి ఏ వేరియంట్‌కి సంబంధించిన కోసులనేవి నిర్ధారించే ప్రయత్నం జరుగుతోందని, నార్మల్‌ కేసులా లేకుంటే ఒమైక్రాన్‌ కేసులా అనేది నిర్ధారించేందుకు అన్ని శాంపిల్స్‌ను జెనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు. ఒమైక్రాన్‌ విస్తరించినప్పటికీ సమర్ధవంతంగా ఎదర్కొనేందుకు ఆసుపత్రుల్లో తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్ని కేసుల విషయంలోనూ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని, హోం ఐసొలేషన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

Read Also:

https://ntvtelugu.com/rahul-gandhi-demanded-that-peoples-issues-be-discussed-in-parliament/


Exit mobile version