Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహం.. కాపాడబోయి అందరూ
- మృతులంతా ఒకే గ్రామానికి చెందినవారే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Tragedy: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ముత్యపుచిప్పల సేకరణ కోసం వెళ్లిన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. నదిలో ముత్యపుచిప్పలు సేకరించడానికి వెళ్లిన ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఏడుగురు మహిళలు కావడం గమనార్హం. ఈ ఘటనలో మరో ఇద్దరు గల్లంతవగా.. ఇద్దరిని స్థానికులు సురక్షితంగా రక్షించారు.
అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహం.. కాపాడబోయి అందరూ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర కన్నడ జిల్లా షిరాలి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నదిలోకి దిగి ముత్యపుచిప్పలను సేకరిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నది ప్రవాహం, నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగాయి. నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో మొదట ఒకరిద్దరు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే నీటిలో మునిగిపోతున్న వారిని రక్షించే క్రమంలో.. మిగిలిన వారు కూడా ఒకరి వెనుక ఒకరు నదిలోకి దూకారు. ప్రవాహ ఉధృతి ఊహించని స్థాయిలో ఉండటంతో రక్షించడానికి వెళ్లిన వారు సైతం నీటి సుడిగుండంలో చిక్కుకుని ఒక్కొక్కరుగా జలసమాధి అయ్యారు. ఇప్పటి వరకు పోలీసులు నది నుంచి ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ఉమేష్ మంజునాథ్ నాయక్ (40) – (మరణించిన వారిలో ఉన్న ఏకైక పురుషుడు)
లక్ష్మీ మహాదేవ్ నాయక్ (42)
లక్ష్మి జుట్టప్ప నాయక్ (30)
లక్ష్మీ అప్పన్న నాయక్ (60)
లక్ష్మి శివరామ్ నాయక్ (49)
జ్యోతి మస్తమ్మ నాయక్ (34)
మాల్తి నాయక్ (38)
మాస్టమ్మ నాయక్ (60)
ఇద్దరు సురక్షితం.. ఇంకా ఇద్దరి కోసం గాలింపు
ఈ ప్రమాదం నుంచి నాగరాత్న, మహాదేవి అనే ఇద్దరు మహిళలను స్థానికులు రక్షించారు. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఇంకా ఇద్దరి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, విపత్తు సహాయక బృందాలు (SDRF), స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మృతులలో చాలామందికి ఇది వరకు నదిలోకి వెళ్లి ముత్యపుచిప్పలు సేకరించిన అనుభవం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈసారి వర్షం కారణంగా నీటిమట్టం క్షణాల్లో పెరిగిపోవడాన్ని వారు ఊహించలేకపోయారని, అందువల్లే ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు.
పరిహారం ప్రకటించిన సీఎం
ఈ దారుణ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు ఆర్.అశోక కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నదీ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు పీఎంఓ (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ.2 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్-గ్రేషియాను అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?