Karnataka IAS Vs IPS Fight: కర్ణాటకలో మహిళ సివిల్ సర్వెంట్ ఇష్యూలో కొత్త ట్విస్ట్.. రూపపై రోహిణి సింధూరి పరువునష్టం..
Karnataka IAS Vs IPS Fight: కర్ణాటకలో ఇద్దర మహిళా సివిల్ సర్వెంట్ల ఇష్యూ కొనసాగుతూనే ఉంది. ఫేస్ బుక్ వేదికగా ఐపీఎస్ రూపా మౌడ్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరి ఫోటోలను షేర్ చేసి, పలు విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరిని కర్ణాటక ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు ప్రభుత్వం అంతా ఈ విషయంపై ఆగ్రహంతో ఉంది. సోషల్ మీడియా వేదికగా, బహిరంగంగా ఎలాంటి విమర్శలు చేసుకోవద్దని ఇద్దరిని హెచ్చరించారు సీఎస్ వందితా శర్మ.
Read Also: Maternal Mortality: ప్రతీ రెండు నిమిషాలకు ఓ తల్లి మరణిస్తోంది.. యూఎన్ రిపోర్ట్..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఇదిలా ఉంటే ప్రభుత్వం, సీఎస్ హెచ్చరికలను పట్టించుకోకుండా బుధవారం రూపా మరోసారి ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్టును పెట్టారు. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నా అని అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనపై విమర్శలు చేసిన ఐపీఎస్ రూపా మౌడ్గిల్ కు లీగల్ నోటీసులు పంపించారు రోహిణి సింధూరి. తనను మానసిక క్షోభకు గురిచేసిన, పరువు పోయేలా విమర్శలు చేసిన రూపా తనకు రాతపూర్వకంగా క్షమాపణలతో పాటు రూ. 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూపా చేసిన వ్యాఖ్యలు తన క్లయింట్, ఆమె కుటుంబ సభ్యలను మానసిక వేధనకు గురిచేశాయని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సామాజిక జీవితంలో రోహిణి ఇమేజ్ నాశనం, రూపా ప్రవర్తన మూలంగా తన క్లయింట్ అయిన రోహిణి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని.. ఈ అంశం బ్యూరోక్రాట్ సర్కిళ్లలో చర్చనీయాంశం అయిందని నోటీసుల్లో పేర్కొన్నారు.
రూపా, రోహిణి సింధూరి గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వివాదం మొదలైంది. రోహిణి సివల్ సర్వీస్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని, పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ విమర్శించింది. దీనిపై స్పందించిన రోహిణి, ఆమె మానసిక స్థితి బాగా లేదని అన్నారు. ఇదిలా ఉంటే బుధవారం రూపా మరో పోస్టు పెట్టారు. దయచేసి రోహిణి సింధూరి ఐఎఎస్పై నేను లేవనెత్తిన అవినీతి సమస్యపై దృష్టి పెట్టండి.. అతి సామాన్యులను ప్రభావితం చేసే అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా నేను ఎవరినీ నిరోధించలేదని అన్నారు. నేను, నా భర్త ఇంకా కలిసి ఉన్నామని, కుటుంబాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి మేము ఇంకా పోరాడుతున్నామని ఎఫ్బీ పోస్టులో రూపా రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!