Karnataka High Court: చేతులు, కాళ్లు నరికేస్తే చట్టాలు పాటిస్తారేమో.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
- అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు.
- "చట్టం తన పదును కోల్పోయింది" అంటూ కోర్టు ఆందోళన.
- నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే కఠిన శిక్షలు అవసరమని అభిప్రాయం.
- "చేతో, కాలో నరికేస్తేనే చట్టం పాటిస్తారేమో" అని వ్యాఖ్య.
- 23 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka High Court: అత్యాచార కేసు విచారణ సమయంలో కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నిందితుడిగా ఉన్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెయిల్ పిటిషన్ పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరాలను అరికట్టాలంటే కఠిన శిక్షలు అవసమరని కోర్టు అభిప్రాయపడుతూ.. ‘‘ఒకరి కాలు లేదా చెయ్యి నరికివేస్తే ప్రజలు చట్టాలను పాటిస్తారేమో’’ అని వ్యాఖ్యానించింది. 23 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్ సమయంలో జస్టిస్ ఆర్ నటరాజ్ ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది.
మన దేశంలో చట్టం తన పదును కోల్పోతోందని, కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టం పట్ల భయం పెరుగుతుందని, కొన్ని పశ్చిమాసియా దేశాల్లో కఠిన శిక్షల కారణంగా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘించడానికి భయపడుతారు అని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ దాదాపుగా రెండు నెలల నుంచి జైలులో ఉన్నాడని, తాను చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నాడని వాదించారు.
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఉప్పు తింటే నీళ్లు తాగాల్సిందే అని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిందితుడు మరికొన్ని రోజులు జైలులో ఉండొచ్చని, భవిష్యత్తులో శిక్ష పడితే మళ్లీ జైలుకు వెళ్లా్ల్సి రావచ్చని అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు వివరాలను పరిశీలిస్తే.. ఈ కేసు మూడేళ్ల క్రితం నాటిది. నిందితుడు ఒక యువతిని స్నేహం పేరుతో మాట్లాడుకుందామని చెప్పి ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. 2023 సెప్టెంబర్ 12న లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 375(a), 376 కింద నమోదు చేశారు. ఈ కేసులో ఉడుపి జిల్లా సెషన్స్ కోర్టు ఇప్పటికే నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!