Siddaramaiah: ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది.. ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు
- ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది
- ఈసీ తీరుపై సిద్ధరామయ్య ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓ జాతీయ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు. నిజమైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని.. నకిలీ పేర్లను చేరుస్తున్నారని రాహుల్గాంధీ చేసిన ఆరోపణలు వాస్తవమని.. నిజం మాట్లాడారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మరింత దిగువకు పసిడి.. నేటి ధరలు ఇలా..!
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా పని చేయడం లేదని ఆరోపించారు. కేంద్రం మద్దతుతో ప్రజాస్వామ్య సంస్థలను ఎన్నికల సంఘం బలహీనపరుస్తోందని పేర్కొన్నారు. కేవలం కేంద్రం ఆదేశాల మేరకు ఈసీ పని చేస్తోందని.. అందుకే ఈసీ స్వతంత్రమైనది కాదన్నారు. వాస్తవానికి స్వతంత్రంగా, న్యాయంగా పని చేయాల్సి ఉంది.. కానీ అలా చేయడం లేదన్నారు. ఎన్నికల సంస్కరణల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా త్వరలో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. దేశవ్యాప్తంగా కుల గణన జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి రాష్ట్రం కుల గణనను ప్రారంభించాలన్నారు.
ఇది కూడా చదవండి: IMD Warning AP: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తాను ఓబీసీ సలహా కమిటీ కన్వీనర్ కాదని, అనిల్ జైహింద్ నాయకత్వంలోని సభ్యుడిని అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో కుల గణన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులకు మూడు నెలల సమయం ఇచ్చామని, గడువులోగా లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!