NTV Telugu Site icon

Karnataka: డీకే శివకుమార్‌తో దర్శన్ సతీమణి భేటీ.. దేనికోసమంటే..!

Karnatakadksivakumar

Karnatakadksivakumar

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను నటుడు దర్శన్ సతీమణి విజయలక్ష్మీ కలిశారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం హీరో దర్శన్ జైల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి భేటీ జరగడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి: Chiranjeevi: లండన్ పార్కులో వాకింగ్.. పారిస్ ఒలంపిక్స్ కి రామ్ చరణ్ తో చిరు!

ఈ భేటీపై డీకే శివకుమార్ మీడియాతో స్పందించారు. కుమారుడి స్కూల్‌ అడ్మిషన్‌ గురించి మాట్లాడేందుకే విజయలక్ష్మీ తనను సంప్రదించినట్లు వెల్లడించారు. తన కుమారుడి భవిష్యత్తు గురించి దర్శన్‌ భార్య విజయలక్ష్మీ ఆందోళన చెందుతోందని తెలిపారు. గతంలో దర్శన్ కుమారుడు తమ పాఠశాలలోనే చదివాడని.. ఆ తర్వాత మరో స్కూల్‌‌కు మారినట్లు చెప్పారు. తిరిగి తమ స్కూల్‌లో కుమారుడికి అడ్మిషన్‌ ఇప్పించాలని విజయలక్ష్మీ విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఈ విషయంలో సహాయం చేస్తానని చెప్పానని.. అడ్మిషన్‌ పొందడానికి ముందు కొన్ని పరీక్షలు నిర్వహిస్తారు.. దీని గురించి కూడా ప్రిన్సిపల్‌తో మాట్లాతానని డీకే శివకుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.?

తన అభిమాన హీరో దర్శన్ కుటుంబాన్ని నాశనం చేసిందంటూ ప్రవిత్రా గౌడ అనే మహిళను ఉద్దేశించి రేణుకాస్వామి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో అతడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో దర్శన్‌, పవిత్రతో సహా మరో 15 మంది జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో డీకేతో విజయలక్ష్మి భేటీ తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే దర్శన్‌ విషయంలో ఆమెకు సహాయం చేస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం నో అని చెప్పారు. పోలీసులు విచారణలో ఉన్న కేసులో జోక్యం చేసుకోలేనని.. కేవలం వారి కుమారుడి భవిష్యత్తు విషయంలో మాత్రమే సహాయం చేయగలను అని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్‌ ర్యాంక్ ఇంత దారుణమా.?