Jyoti Malhotra: పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో జ్యోతి మల్హోత్రాకు సంబంధాలు.. అంతా తెలిసే చేసింది..
- సంచలనంగా జ్యోతి మల్హోత్రా కేసు..
- నలుగురు ఐఎస్ఐ ఏజెంట్లతో ఆమెకు సంబంధాలు..
- పాకిస్తాన్లో వీఐపీ ట్రీట్మెంట్..
- ఫోన్, ల్యాప్టాప్లో 12 టీబీ డేటా రికవరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Malhotra: పాకిస్తాన్ “గూఢచారి” యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం భారతదేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. తాజాగా, ఆమె పాకిస్తాన్లోని లాహోర్లో పర్యటిస్తున్న సమయంలో ఏకే-47 గన్మెన్లు సెక్యూరిటీగా ఉన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈమెతో సహా మరో 11 మందిని కూడా గూఢచర్యం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఇప్పటి వరకు మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఆమె జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం సంచలనంగా మారింది.
Read Also: Indian Students: క్లాసులకు రాకుంటే వీసా రద్దు.. భారత విద్యార్థులకు అమెరికా హెచ్చరిక..
Also Read
ఇదెలా ఉంటే, జ్యోతి నలుగురు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఐఎస్ఐతో కలిసి పని చేస్తున్నట్లు తెలుసని అధికారులు గుర్తించారు. హర్యానా పోలీసులు ఆమె డిజిటల్ పరికరాలను పరిశీలించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జ్యోతి మల్హోత్రా ఫోన్, ల్యాప్ టాప్ సహా అన్ని డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె అందులోని మెసేజ్లు, డేటాని తొలగించినప్పటికీ, పోలీసులు 12 టీబీ డేటాను తిరిగి పొందగలిగారు. అధికార వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, జ్యోతి తాను ఐఎస్ఐ అధికారులతో మాట్లాడుతున్నట్లు బాగా తెలుసని, ఆమె ఎలాంట భయం లేకుండా సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు, జ్యోతి మల్హోత్రా విలాసవంతమైన ప్రయాణాలు, ఆమె ఆదాయానికి అసమానంగా ఉన్న ఖర్చులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!