Venkaiah Naidu: న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు.. మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: ఇటీవల కాలంలో చట్టసభలు, న్యాయవ్యవస్థల మధ్య కాస్త ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాల రూపకల్పనలో చట్టసభల ఆధిపత్యాన్ని ఆయన శనివారం సమర్థించారు. ఢిల్లీలో నేషనల్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ్యాంగం కార్యనిర్వహక, శాసన సభ(పార్లమెంట్ అండ్ అసెంబ్లీలు), న్యాయవ్యవస్థకు సంబంధించిన పాత్రలను స్పష్టంగా నిర్వచించిందని, ఎవరూ కూడా తాము అత్యున్నతమని భావించి వారి పరిమితులను అధిగమించ కూడదని అన్నారు.
Read Also: Murder: జీతం వివాదంలో దారుణంగా హత్య చేసిన యజమాని.. కాన్పూర్ లో ఘటన
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
చట్టాలు చేసే అధికారం శాసనసభలకు మాత్రమే ఇవ్వబడ్డాయని, చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్నాయా..? లేదా..? అనే విషయాలను న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుందని, న్యాయస్థానాలు చట్టాలు లేయలేవని అన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయదు అనేది గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చట్టసభలు చట్టాలు చేస్తాయి, కార్యనిర్వహక వ్యవస్థ అమలు చేస్తుందని, చివరకు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లవచ్చని చెప్పారు. న్యాయవ్యవస్థ డైనమిక్ గా ఉండాలి, వారు వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించాలని వెంకయ్య నాయుడు అన్నారు.
పార్లమెంటు చట్టం చేసేంత వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజనపై వివాదం తలెత్తిన నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలు, పార్లమెంట్ లో పదేపదే అంతరాయాలు ఏర్పడటంపై వెంకయ్య నాయుడు ఆదేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని, శాసనసభల్లో, పార్లమెంట్లో పేపర్లు చించేయడం, మైకులు విరగొట్టడం జరగకుండా చూడాలని ఆయన సూచించారు. సభల్లో వ్యతిరేకత, విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండకూడదని తాను చెప్పడం లేదని, వాస్తవానికి నిరసనలు, భిన్నాభిప్రాయాలు, చర్చలు ప్రజాస్వామ్యం యెక్క లక్షణాలని ఆయన తెలిపారు. కానీ గౌరవప్రదంగా, పార్లమెంటరీ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!