Jammu Kashmir: కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురి దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Road Accident: జమ్మూ కాశ్మీర్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజౌరి జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూంఛ్ నుంచి రాజౌరి వెళ్తున్న బస్సు మంజాకోట్ ప్రాంతం వద్ద అదుపుతప్పి లోయలో పడింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
READ ALSO: Pawan Kalyan : పవన్ కల్యాణ్ యాత్రకు ముస్తాబవుతున్న బస్సు..
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
వరసగా రెండు రోజుల్లో జమ్మూ కాశ్మీర్ లో రెండు ప్రమాదాలు జరిగాయి. బుధవారం కూడా కాశ్మీర్లో అదుపు తప్పి ఓ మినీ బస్సు లోయలో పడిపోయింది. పూంఛ్ జిల్లాలోని సాజియాన్ ప్రాంతంలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని మండీలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. పూంచ్ నుంచి గాలి మైదాన్ ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో బస్సు లోయలో పడింది. వెంటనే సమాచారం అందుకున్న కాశ్మీర్ పోలీసులు, సైన్యం రెస్క్యూ ప్రారంభించింది. సరిహదుద్ ప్రాంతమైన సాజియాన్ లోని సబ్రారీ నాలకు రాగానే బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు వెల్లడించారు.
Deeply pained by the news of another tragic road accident in hilly district of Rajouri, at Deri Ralyote (Manjakote).
My deepest condolences to the families who lost their loved ones and pray for the speedy recovery of the injured. pic.twitter.com/UaoobVe8Ru— Chander Mohan Gupta(Modi ka Parivar) (@CMGuptaOfficial) September 15, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!