NTV Telugu Site icon

Breaking: అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించడానికి ఐఎస్ఐ భారీ కుట్ర..

Amrnath Yatra

Amrnath Yatra

Breaking: దేశవ్యాప్తంగా ఎంతో ప్రముఖ్యత కలిగిన అమర్‌నాథ్ యాత్రలో విధ్యంసం సృష్టించేందుకు ఐసీస్ భారీ కుట్ర పన్నింది. దీని కోసం బబ్బర్ ఖల్సా ఉగ్రవాద సంస్థతో కలిసి ఐఎస్ఐ ఈ కుట్రకు ప్లాన్ చేసింది. ఈ హింసలో ముఖ్యంగా హిందూ నేతలు, భారతీయ జనతా పార్టీ నేతలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని విధ్యంసం సృష్టించడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే, ఈ కుట్రకు పంజాబ్ లోని గ్యాంగ్ స్టర్లు, ఉగ్రవాదులతో కలిసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం గత నెల 25వ తేదీన పఠాన్ కోట్ పరిసరాల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించారు.

Read Also: Gold PriceToday: షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?

ఇక, దేశంలో విధ్వంసం సృష్టించడానికి జమ్మూ కశ్మీర్‌లోకి 7 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ కు చెందిన కొందరు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం. దీంతో అలర్టైన భారత బలగాలు అమర్‌నాథ్ యాత్రకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కాగా, జమ్మూలో టెర్రరిస్టులు చొరబడినట్లు సమాచారం అందడంతో వారిని కనిపెట్టేందుకు ఇంటెలిజెన్స్ టీమ్స్ లను అప్రమత్తం చేసినట్లు తెలుస్తుంది.