Site icon NTV Telugu

PIB Fact Check: రూ.500 నోట్లు చెలామణిపై అనుమానాలు.. నిజమెంత..?

500

500

PIB Fact Check: ప్రస్తుతం భారతదేశంలో చెలామణిలో ఉన్న 500 రూపాయల నోట్లు వచ్చే ఏడాది మార్చి వరకు దశల వారీగా నిలిచిపోతాయంటూ కొనసాగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఓ ఛానల్‌కు సంబంధించిన యూట్యూబ్‌ వీడియోలో ఆర్‌బీఐ రూ.500 నోట్ల చెలామణిని 2026 మార్చి నాటికి బంద్ చేస్తారన్న అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఈ ఫేక్ ప్రచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఎక్స్‌ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టింది. “ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏం చేయలేదు.. రూ.500 నోట్లు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి అని వెల్లడించింది.

Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన విషయాలు.. నష్టాన్ని బయటపెట్టిన అధికారులు…!

అయితే, చాలా రోజుల నుంచి ఇలాంటి అసత్య వార్తలు ప్రసారం అవుతున్నాయి.. ప్రజలు ఎవరు కూడా ఈ ఫేక్ న్యూ్స్ ను నమ్మొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మడం, మరొకరికి షేర్‌ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి సరైనా సమాచారం ధ్రువీకరించుకోవాలని ప్రజలకు ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం సూచించింది.

Exit mobile version