Custodial Death: కస్టోడియల్ డెత్పై సీఎం స్టాలిన్ క్షమాపణ.. ఒక్క సారీతో సరిపోతుందా..?
- తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న కస్టోడియల్ డెత్..
- అజిత్ కుమార్ తల్లికి క్షమాపణలు చెప్పిన సీఎం ఎంకే స్టాలిన్..
- సీఎం స్టాలిన్ క్షమాపణలపై తీవ్రంగా మండిపడిన బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Custodial Death: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కస్టోడియల్ డెత్ కేసు కుదిపేస్తోంది. శివగంగ జిల్లాలో అజిత్ కుమార్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అనుమానితుడిని ప్రశ్నించిన పోలీసులు, హింసకు దిగారు. వారి దెబ్బలను తట్టుకోలేక అజిత్ కస్టడీలోనే మృతి చెందాడు. దీంతో పోలీసులు హింసించడంతోనే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా అజిత్పై చిత్రహింసలు జరిగినట్లు తేలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. అజిత్ మరణానికి బాధ్యులైన ఐదుగురు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Dil Raju: పైరసీ చేసి చిన్న సినిమాకు 400, పెద్ద సినిమాకు 100 డాలర్లకి అమ్ముతున్నారు!
Also Read
- Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
- PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
- Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
- Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం ‘క్షమించండి’ అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి వెంటనే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, స్టాలిన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కస్టడీలో లేదా అనుమానాస్పద పరిస్థితులలో మరణించిన 23 మంది పేర్ల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని నామక్కల్, తిరునల్వేలి, చెన్నై, మధురై, విల్లుపురం, చెంగల్పట్టుతో సహా ఇతర జిల్లాల్లో కూడా కస్టోడియల్ మరణాలు జరిగాయని ఆరోపించారు. చనిపోయిన ఆ 23 మందికి చెందిన తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు ఫోటో షూట్ నిర్వహిస్తారు? అని తమిళనాడు బీజపీ చీఫ్ ఎగతాళి చేశారు.
மாண்புமிகு முதல்வர் திரு. @mkstalin அவர்கள், காவலர்களால் படுகொலை செய்யப்பட்ட திரு. அஜித் குமாரின் தாயிடம் “"சாரி மா" என்று சொல்லும் நேர்த்தியாக வெட்டி ஒட்டப்பட்ட காணொளியை செய்திகளில் பார்த்தேன். ஒரு அப்பாவி இளைஞனைத் துள்ளத் துடிக்கக் கொன்றுவிட்டு, ஒரே வரியில் “சாரி” என்று சொல்வது…
— Nainar Nagenthiran (@NainarBJP) July 2, 2025
తాజావార్తలు
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
-
PM Modi: రష్యా, ఇరాన్ విదేశాంగ మంత్రులతో మోడీ భేటీ.. ఇంధన సంక్షోభంపై చర్చ
-
YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Pakistan: ఢిల్లీని టార్గెట్ చేసే మిస్సైల్ను పరీక్షించిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?