Fact-Check: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ చనిపోయాడా..? నిజం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact-Check: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తున్న నేపథ్యంలో ఇది కూడా నిజమని చాలా మంది భావించారు. ముఖ్యంగా భారత్లోని చాలా మంది ఈ వార్తలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీనికి ముందు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఇటీవల విషప్రయోగం జరిగిందని, ఆయన మరణించాడనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా మసూద్ అజార్ మరణించాడని సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వీడియోలు ఫేక్ అని తేలింది. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్, అజార్ మరణాన్ని ధృవీకరిస్తు్న్న స్క్రీన్ షాట్స్ కూడా నకిలీవని తేలింది.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ఉదయం 5 గంటలకు మసీదు నుంచి తిరిగి వస్తుండగా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ బావల్పూర్లో జరిగిన బాంబు దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మరణించినట్లు పలు హ్యాండిల్స్ పేర్కొన్నాయి. వ్యక్తిగత కక్షల కారణంగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ పేలుడుకు పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ లోని ఏ ప్రధాన మీడియా కూడా ఈ విషయాన్ని నివేదించలేదు. ముందుగా కాలిపోతున్న ఓ కారు పోస్టును పోస్ట్ చేసింది టైమ్ ఆల్జీబ్రా అనే హ్యాండిల్. ఇదే ఫొటోను ముజఫరాబాద్ న్యూస్ బులెటిన్ కూడా వాడింది.
Read Also: Delhi High Court: భర్తపై అలాంటి ఆరోపణలు చేయడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట..
అయితే, ఈ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. నవంబర్ 3న, పాక్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్లో పోలీస్ వ్యాన్ లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ ఘటనలో 6 మంది చనిపోగా.. 25 మంది గాయపడినట్లు OSINT అనే ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. పోస్టులోని ఫోటోలను రీసైకిల్ చేసినట్లు తెలుస్తోంది. వీటిని 2019లో హస్నన్ అలీ అనే హ్యాండిల్ మొదటిసారిగా పోస్ట్ చేసింది. ఈ పేలుడులో ముగ్గురు టిక్ టాకర్ల్ మరణించినట్లు క్యాప్షన్ కూడా పెట్టారు.
మసూద్ అజార్ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. భారతదేశంలో పలు ఉగ్రవాద దాడుల్లో ఇతని ప్రమేయం ఉంది. 2001 పార్లమెంట్ దాడి, 2005 అయోధ్యలో దాడి, 2019 పుల్వామా అటాక్తో పాటు, ముంబై దాడుల్లో కూడా ఇతర ప్రయేయం ఉంది. జనవరి 2016లో ఆఫ్ఘనిస్తాన్ మజార్ ఏ షరీఫ్ లోని భారత కాన్సులేట్పై దాడికి కూడా పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?