Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Investigation Agency Gets Key Information About Pahalgam Terrorists Attack

Pahalgam Attack: ఉగ్రవాదుల మారణహోమంపై కీలక ఆధారాలు లభ్యం.. భారత్‌లోకి ఎలా వచ్చారంటే..!

Published Date :June 24, 2025 , 1:52 pm
By Suresh Maddala
  • పహల్గామ్ ఉగ్రవాదుల మారణహోమంపై కీలక ఆధారాలు లభ్యం
  • స్థానికుల అరెస్ట్‌తో ముఖ్య సమాచారం లభ్యం
Pahalgam Attack: ఉగ్రవాదుల మారణహోమంపై కీలక ఆధారాలు లభ్యం.. భారత్‌లోకి ఎలా వచ్చారంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. తాజాగా ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది.

ఇది కూడా చదవండి: Kollywood : దళపతి విజయ్.. త్రిష లవ్ ఎఫైర్.. నిజమెంత.?

Also Read

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Bengal Elections: ఎన్నికల కౌంటింగ్‌ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
  • RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
  • Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..

బాట్కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్‌లను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లుగా ఒప్పకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత.. ముగ్గురు ఉగ్రవాదులకు హిల్ పార్క్‌లోని ఒక గుడిసెలో ఉన్నట్లుగా తేలింది. ఈ ఉగ్రవాదులకు స్థానికులైన పర్వైజ్, బషీర్ ఆహారం, ఇతర వసతులు కల్పించినట్లుగా తేలింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేరవేసినట్లుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

ఇక ముగ్గురు ఉగ్రవాదులు.. పాకిస్థాన్‌లోని అబోటాబాద్ నుంచి ముజఫరాబాద్ మీదుగా పూంజ్-రాజౌరికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దు కారిడార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక నిఘా వర్గాల దర్యాప్తు మేరకు.. ముగ్గురు ఉగ్రవాదులు కూడా అధిక శిక్షణ పొందినవారుగా కనిపెట్టారు. శిక్షణలో అధునాతన పోరాట పటిమలు కలిగిన వారిగా తేల్చారు. అంతేకాకుండా రహస్య కదలికలు, మనుగడ వ్యూహాలు కలిగి ఉన్నట్లుగా తేలింది. పహల్గామ్‌కు ముందు జమ్మూకాశ్మీర్‌లోని స్పిన్నర్ ప్రాంతంలో జరిగిన దాడులతో పాటు పలు దాడుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక ఉగ్రవాదుల కదలికలు గురించి డిజిటల్ పాదముద్రలు, కమ్యూనికేషన్ మార్గాలను దర్యాప్తు సంస్థ విశ్లేషిస్తోంది. ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపయోగించడం వల్ల ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ప్రధానంగా స్థానికుల మద్దతుతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం స్థానికులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. స్త్రీలను, పిల్లలను వదిలిపెట్టి భర్తలను చంపేశారు. పదుల కొద్ది గాయపడ్డారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Investigation agency
  • Key information
  • NIA
  • Pahalgam Attack
  • Pahalgam terrorists Attack

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions