Indus Waters Treaty: భారత్ ‘‘రావి’’ దెబ్బ.. పాకిస్తాన్లో నీటి సంక్షోభం ఖాయం..
- రావి కుళాయిని కట్టేస్తున్న భారత్..
- పాకిస్తాన్లో ఈ వేసవిలో తీవ్ర నీటి సంక్షోభం..
- రావి నదిపై పూర్తవుతున్న షాపూర్ కండి ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indus Waters Treaty: ఈ వేసవిలో దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోబోతోంది. ‘‘రావి’’ నీటి కుళాయిని భారత్ మూసివేసింది. ఇన్నాళ్లు ‘‘ఇండస్ వాటర్ ట్రిటీ’’ని అడ్డుపెట్టుకుని భారత వాటా నీటిని కూడా ఎంజాయ్ చేసిన పాకిస్తాన్కు అసలు దెబ్బ తగలబోతోంది. సిందు జలాల ఒప్పందం నిలిపేయడంతో ఇప్పటికే పాక్ సతమతమవుతున్న సమయంలో, మార్చి 31 నాటికి షాపూర్ కండి ప్రాజెక్టును పూర్తి చేయాలని భారత్ అనుకుంటోంది. దీనికి రావి నది నుంచి అదనపు నీటి ప్రవామాన్ని నిరోధించింది. భారత్ వైపు రావి నదిపై ఇన్నాళ్లు సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో పాకిస్తాన్ భారత్ వాటా నీటిని కూడా వాడుకుంది. ఈ ఏప్రిల్ నుంచి మాత్రం పాకిస్తాన్ నీటి సంక్షోభంతో విలవిల్లాడాల్సిందే. జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అందించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి జావెద్ అహ్మద్ రాణా సోమవారం ప్రకటించారు.
పాక్ను ఎలా దెబ్బతీస్తుంది.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ప్రస్తుతం రావి మిగులు జలాలు మాధోపూర్ ద్వారా ప్రవహిస్తున్నాయి. అయితే, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మధ్య దశాబ్ధాలుగా ఉన్న రాజకీయ నిర్లక్ష్యం, గొడవల కారణంగా ఏళ్లుగా నిలిచిపోయిన షాపూర్ కండి బ్యారేజీ నీటి వృధాను అరికడుతుంది. ప్రస్తుతం పాక్ వైపు వెళ్తున్న సింధు నీటిని నిలిపేసి భారత్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని కేంద్ర జల వనరుల మంత్రి సీఆర్ పాటిల్ వారం క్రితం చెప్పారు.
సింధు నది వ్యవస్థలో మూడు తూర్పు నదుల్లో ఒకటైన రావి నీటిపై భారత్కు సంపూర్ణ హక్కులు ఉన్నాయి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ద్వారా తూర్పు నదులైన సట్లేజ్, బియాస్, రావిపై హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్పై పాక్కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే, తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోడీ ప్రభుత్వం మార్చేసింది.
పాక్ వ్యవసాయం 80 శాతం సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపేసిన తర్వాత పాక్లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.
షాపూర్ కండి బ్యారేజ్:
దీనికి 1979లో ప్రణాళిక వేస్తే, 1982లో ఇందిగా గాంధీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. మోడీ ప్రభుత్వం 2018లో రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. మార్చి 31, 2026 నాటికి ఇది పూర్తవుతుంది. దీని ద్వారా 32,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా చీనాబ్పై హైడ్రో పవర్ ప్రాజెక్టుల్ని, జీలం నదిపై వులార్ బ్యారేజ్ పనుల్ని భారత్ వేగంగా చేస్తోంది. దీని వల్ల పాక్కు నీటి కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!