Shyam Saran Negi: స్వతంత్ర భారత తొలి ఓటర్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s first voter Shyam Saran Negi passes away at 106: స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. శనివారం హిమాచల్ ప్రదేశ్ కల్పాలోని తన స్వస్థలంలో మరణించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన రెండు రోజుల తర్వాత ఆయన మరణించారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ 14వ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. రెండు రోజుల క్రితమే అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయించారు. ఇది జరిగిన రెండు రోజులకే ఆయన మరణించడం పట్ల హిమాచల్ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. దేశంలో తొలి ఓటర్ గా నమోదు అయిన శ్యాం శరణ్ నేగి 1951 అక్టోబర్ 23న కల్పాలోని పోలింగ్ బూత్ లో మొదటి ఓటు వేశారు. ఈ ఏడాది నవంబర్ 2న 34వ సారి ఓటు వేశారు.
Read Also: K.A.Paul: ఎన్కౌంటర్ చేయిస్తారేమో అని భయపడ్డా
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
ఆయన మరణంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ స్వతంత్ర భారత తొలి ఓటరు, కిన్నౌర్కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ మరణవార్త వినడం బాధాకరం’’ అని సీఎం ట్వీట్ చేశారు. భారతదేశ తొలి ఓటర్ అయిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి ఈ ఉదయం ఆయన స్వస్థలం కల్పాలో కన్నుమూశారు.. ప్రభుత్వ గౌరవాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కిన్నౌర్ కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల ఆయన ఓటేసిన సందర్భంలో ప్రధాని మోదీ.. ‘‘ఇది అభినందనీయం.. యువ ఓటర్ల ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రేరణగా ఉపయోగపడుతుంది.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి’’ అంటూ ట్వీట్ చేశారు.
1951 నుంచి వరసగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటున్నారు శ్యాంశరణ్ నేగి. జూలై 1917లో జన్మించారు నేగి. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన పేరు మారుమోగింది. లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 సార్లు ఓటేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన నేగి ఏనాడు కూడా తన ఓటు హక్కు అవకాశాన్ని వదులుకోలేదని.. తన చివరి రోజుల్లో కూడా ఓటు వేశారని హిమాచల్ ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!