Anji Khad bridge: ఇండియాలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైలు వంతెన సిద్ధం.. ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anji Khad bridge: భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ ఆధారితంగా నిర్మించిన రైలు వంతెన సిద్ధం అయింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అంజి ఖాడ్ వంతెనగా పిలువబడే ఈ బ్రిడ్జ్ కు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ బ్రిడ్జ్ వినియోగానికి సిద్ధం అయిందని, దీంట్లో మొత్తం 96 కేబుల్స్ ఉన్నాయని, కేబుల్స్ లో ఉండే మొత్తం వైర్ల పొడవు 653 కిలోమీటర్లు అని, 11 నెలల్లో ఈ వంతెనను నిర్మించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా (USBRL) రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. జమ్మూ కాశ్మీర్ ను భారత్ లోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా కనెక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. జమ్మూ నుంచి ఈ వంతెన దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంజి ఖాడ్ వంతెన జమ్మూ కాశ్మీర్లోని కట్రా, రియాసిలను కలుపుతుంది.
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
Read Also: Rekha Singh: భర్త పేరు నిలబెట్టింది.. ఆర్మీ ఆఫీసర్గా “గాల్వాన్ హీరో” భార్య..
హిమాలయాల్లో భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశంలో వంతెన నిర్మించాలంటే ఇంజనీరింగ్ అద్భుతమే అని చెప్పవచ్చు. రూర్కీ, ఢిల్లీ ఐఐటీల పరిశోధకలు వంతెన నిర్మించే స్థలం వద్ద పలు రకాల పరిశోధనలు చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం అయింది. మొత్తం వంతెన పొడవు 725.5 మీటర్లు. మొత్తం వంతెనను 4 భాగాలుగా విభజించారు. రియాసి వైపున 120 మీటర్లు పొడవు కలిగిన వయాడక్ట్, కట్రా చివరలో 38 మీటర్ల పొడవున్న వయాడక్ట్, ప్రధాన వంతెన 475.25 మీటర్ల కేబుల్ స్టెడ్, దీనికి అప్రోచ్ గా 94.5 మీటర్ల వయాడక్ట్ ఏర్పాటు చేసి వంతెనను నిర్మించారు. ఇందులో ప్రధాన వంతెన మొత్తం పొడవు 475.25 మీటర్లు. అంజి ఖాడ్ వంతెన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ యొక్క కత్రా-బనిహాల్ సెక్షన్లో T2 మరియు T3 సొరంగాలను కలుపుతుంది.
ఈ వంతెన పునాది పైభాగం నుండి 193 మీటర్ల ఎత్తులో ఒకే ప్రధాన పైలాన్ను కలిగి ఉంది, ఇది నదీ గర్భం నుండి 331 మీటర్ల ఎత్తులో ఉంది. గంటకు 213 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకుని ఉండేలా ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. దీని నిర్మాణం కోసం 40 టన్నులను ఎత్తగలిగే శక్తివంతమైన క్రేన్ ను స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. వంతెన పూర్తిగా సెన్సార్స్ అమర్చారు.
In 11 months, India’s first cable stayed rail bridge is ready.
All 96 cables set! #AnjiKhadBridge
PS: Total length of cable strands 653 km🌁 pic.twitter.com/CctSXFxhfa— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 28, 2023
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..