Delhi: పాక్ సెలబ్రిటీలకు భారత్ బిగ్ షాక్.. సోషల్ మీడియా ఖాతాలు మళ్లీ బ్యాన్
- పాక్ సెలబ్రిటీలకు భారత్ బిగ్ షాక్
- సోషల్ మీడియా ఖాతాలు మళ్లీ బ్యాన్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన ఛానల్స్, సోషల్ మీడియా ఖాతాలపై భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది. అయితే తిరిగి భారత్లో ప్రత్యక్షమయ్యాయి. భారతీయులంతా ఆశ్చర్యపోయారు. దీంతో భారతప్రభుత్వం అప్రమత్తం అయింది. తాజాగా పాక్ సోషల్ మీడియా ఖాతాలను భారత్ నిషేధించింది. హనియా అమీర్, షాహిద్ అఫ్రిది, మహీరా ఖాన్ వంటి పాకిస్థాన్ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ను బ్యాన్ చేశాయి. దీంతో వారి ఖాతాలు భారతీయులకు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: ఏంటి ఈ దూకుడు.. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
బుధవారం భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెల్లు, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. సబా కమర్, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, షాహిద్ అఫ్రిది, అహద్ రజా మీర్, యుమ్నా జైదీ, డానిష్ తైమూర్ వంటి అనేక మంది పాకిస్థానీ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. అదనంగా హమ్ టీవీ, ARY డిజిటల్, హర్ పాల్ జియో వంటి యూట్యూబ్ ఛానెల్లు కూడా మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. తిరిగి వాటిపై చర్యలు చేపట్టింది. గురువారం వాటిపై బ్యాన్ విధించినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sonam Raghuwanshi: హనీమూన్ కి తీసుకెళ్లి భర్తను చంపిన సోనమ్ రఘువంశికి.. పిండదానం చేసిన మహిళలు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారతప్రభుత్వం.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్పై పాకిస్థాన్ సెలబ్రిటీలు లేనిపోని వార్తలు సృష్టించారు. దీంతో వెంటనే పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియాలో ఖాతాలను బ్యాన్ చేశారు. ఉన్నట్టుండి బుధవారం భారత్లో తిరిగి ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అలజడి రేగింది. తిరిగి పాకిస్థాన్ ఛానల్స్ను భారత్ పునరుద్ధరించిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై భారతప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వాటిన్నింటిపైనా బ్యాన్ విధించింది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!