Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- చమురు మార్కెట్ను శాసించేది భారత్..
- 2035 నాటికి భారత్ వాటానే 50 శాతం ఉంటుంది..
- రష్యా చమురు సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: భారత్ను ఉద్దేశించి రష్యా ప్రభుత్వ చమురు దిగ్గజం రోస్నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో మాట్లాడిన ఆయన.. ప్రపంచ చమురు రంగంలో భారత్ భవిష్యత్తు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే దశాబ్ధంలో ప్రపంచ చమురు డిమాండ్ పెరుగుదలలో దాదాపు 50 శాతం వాటా భారత్దే అని అంచనా వేశారు. 2035 నాటికి భారత చమురు వినియోగం రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని, ఇది ప్రస్తుత స్థాయిలో పోలిస్తే 44 శాతం పెరుగుదల అని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో, అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) అంచనాల ప్రకారం, ప్రపంచ చమురు డిమాండ్ కేవలం 5 శాతం మాత్రమే పెరుగుతుందని సెచిన్ అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో చమురు మార్కెట్లో భారత్ అత్యంత కీలక వృద్ధి కేంద్రంగా మారబోతున్నట్లు చెప్పారు. 2022 ఏప్రిల్ ననుంచి రష్యా నుంచి భారత్, చైనాలు చమురు దిగుమతి చేసుకోవడం వల్ల గణనీయంగా ఆర్థిక ప్రయోజనం పొందాయని సెచిన్ వెల్లడించారు. ఈ లాభాల విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అన్నారు. రస్యాతో కొనసాగుతున్న ఇంధన భాగస్వామ్యం వల్ల స్థిరమైన సరఫరా సాధ్యమైందని, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో రష్యాను పెట్టడం సాధ్యం కాదని తెలిపారు.
Also Read
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
- E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగితే, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుదని సెచిన్ హెచ్చరించారు. ముఖ్యంగా భారత్, ఆగ్నేయాసియా దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటాయని అన్నారు. ఇంధన సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు పెరగడం ద్వారా ఆహార ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!