Site icon NTV Telugu

ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు…

ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 7,974 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 343 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,478 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,245 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక గత 24 గంటల్లో 7,948 మంది కోలుకున్నారు. అలాగే మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,35,25,36,986 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

Exit mobile version