Site icon NTV Telugu

ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 6,984 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 247 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,710,628 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,76,135 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,34,61,14,483 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 68,89,025 టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది.

Exit mobile version