Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- హార్ముజ్ సంక్షోభానికి భారత్ చెక్..
- సముద్రగర్భంలో భారీ పైప్లైన్ ప్రాజెక్ట్..
- యూఏఈ-ఒమన్ నుంచి నేరుగా గ్యాస్..
- ప్రాజెక్ట్ వ్యయం దాదాపుగా రూ. 40 వేల కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Pipeline: భారత్ సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటోంది. దేశ ఇంధన భద్రత కోసం భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. అరేబియా సముద్రం గర్భంలో భారీ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. హార్ముజ్ సంక్షోభం కారణంగా, ఈ ఇరుకైన సముద్ర మార్గంపై ఆధారపడకుండా నేరుగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ తెచ్చుకునేందుకు భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
యూఏఈ- ఒమన్ నుంచి నేరుగా భారత్కు గ్యాస్ వచ్చే ప్రతిపాదిత ప్రాజెక్టుకు సుమారుగా రూ. 40,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడేళ్లు పడుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ కన్సార్టియం సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్ప్రైజ్ (SAGE) నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఒక నివేదికను సిద్ధం చేయమని ప్రభుత్వ రంగ సంస్థలైన GAIL, ఇంజనీర్స్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లను మంత్రిత్వ శాఖ కోరనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ఏమిటి ఈ పైప్లైన్..?
యూఏఈ, ఒమన్ మీదుగా అరేబియా సముద్రం గుండా ఈ పైప్లైన్ వెల్తుంది. 2500 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వులు ఉన్న ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, ఖతార్ నుంచి గ్యాస్ పొందేందుకు ఈ పైప్లైన్ భారతదేశానికి వీలు కల్పిస్తుంది.
సుమారుగా 3450 మీటర్ల లోతు వరకు ఈ పైప్ లైన్ ఉండొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్రగర్భ పైప్లైన్లలో ఒకటిగా నిలుస్తుంది. సముద్రగర్భ పరిస్థితుల్ని అంచనా వేయడానికి సేజ్ సంస్థ ఈ మార్గంలో రూ. 25 కోట్ల వ్యయంతో సుమారు 3000 మీటర్ల టెస్ట్ పైప్లైన్ వేసింది.
ఒక వేళ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే హార్ముజ్ను పూర్తిగా బైపాస్ చేయవచ్చు. ట్యాంకర్ల అవసరం లేకుండా నేరుగా గ్యాస్ భారత్ చేరుతుంది. దీర్ఘకాలంలో గ్యాస్ చౌకగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యూఏఈ తన భూభాగం నుంచి ఒమన్ తీరం వరకు చమురు పైప్ లైన్ నిర్మాణం చేయాలని భావిస్తుంది. ఇదే జరిగితే హార్ముజ్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒమన్ తీరం నుంచి చమురు ట్యాంకర్లు భారత్ చేరవచ్చు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?