LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
- ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠం..
- 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి..
- గతంలో గల్ఫ్ దేశాల నుంచే మెజారిటీ వాటా..
- సంక్షోభ సమయంలో పెరిగిన ఉత్పత్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాక్ చేయడం భారత్కు అనేక పాఠాలు నేర్పింది. 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశానికి ఇంధన భద్రత అనేది చాలా కీలకం. ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు చమురు, గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. ఇరాన్ యుద్ధం వల్ల భారత్లో ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. ముఖ్యంగా, ఎల్పీజీ గ్యాస్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందారు. అయితే, మోడీ ప్రభుత్వం ప్రజలకు గ్యాస్ కొరత రాకుండా చూసుకుంది.
యుద్ధం నేర్పిన పాఠం:
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే, ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో భారత్ ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతుల్ని పెంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ ప్రజలకు ఎలాంటి సరఫరా కొరత లేకుండా చూసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎల్పీజీ ట్యాంకర్లు భారత్కు వస్తూనే ఉంటాయి. దేశ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పాట్ మార్కెట్ నుంచి ఎల్పీజీ కార్గోలు జూన్, జూలై నెలల్లో భారత్ చేరుకుంటాయి.
15 దేశాల నుంచి ఎల్పీజీ:
అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకునేది. అయితే, ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా దేశ ప్రజలు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. భారత్కు ప్రతీ రోజూ సుమారుగా 80,000 టన్నుల ఎల్పీజీ అవసరం. ఇదిలా ఉంటే, దేశంలో ఉత్పత్తి దాదాపుగా 20 శాతం పెరగడం ద్వారా 46,000 టన్నులకు చేరింది.
ఇదే కాకుండా భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటోంది. గతంలో ఈ దేశాల సంఖ్య 10గా ఉండేది. యుద్ధానికి ముందు గల్ఫ్ నుంచే 90 శాతం గ్యాస్ వచ్చేది. వీటిలో ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఎల్పీజీ సంక్షోభం తర్వాత నుంచి మోడీ సర్కార్ అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుంచి కూడా గ్యాస్ను దిగుమతి చేసుకుంటోంది.
తాజావార్తలు
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!