India: 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లలోని 31 డ్యామ్లకు వరద పోటెత్తుతోంది.
మహారాష్ట్ర భారీ వర్షాలతో అల్లాడుతోంది. పాల్ఘర్, పూణే జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా్యి. చించ్వాడ్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నిన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ నగరంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. గోండియా జిల్లాలో నలుగురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. గుజరాత్ రాష్ట్రం వానల ధాటికి అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 30 జలాశయాలు 70 శాతం సామర్థ్యాన్ని దాటాయాి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజ్ కోట్, గిర్ సోమనాథ్, జామ్ నగర్, భరూచ్, కచ్, నవ్సారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
Read Also: Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం
మధ్యప్రదేశ్ నర్మదాపురం డివిజన్ లోని అన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. గోదావరి నది అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గత 5 రోజుల్లో 219.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 455 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది.
కోస్తా కర్ణాటక, మల్నాడు ప్రాంతాల్లో అనేక చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుంగభద్ర నదీ ప్రవాహం తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో హంపిలోని వారసత్వ ప్రదేశాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక తమిళనాడులోని కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఒడిశాలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేసింది.
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!