India: 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు.. ఐఎండీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లలోని 31 డ్యామ్లకు వరద పోటెత్తుతోంది.
మహారాష్ట్ర భారీ వర్షాలతో అల్లాడుతోంది. పాల్ఘర్, పూణే జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా్యి. చించ్వాడ్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నిన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ నగరంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. గోండియా జిల్లాలో నలుగురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. గుజరాత్ రాష్ట్రం వానల ధాటికి అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 30 జలాశయాలు 70 శాతం సామర్థ్యాన్ని దాటాయాి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజ్ కోట్, గిర్ సోమనాథ్, జామ్ నగర్, భరూచ్, కచ్, నవ్సారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: Telangana GHMC:: వర్షాలు తగ్గేవరకు సెలవుల్లేవ్.. సర్కార్ ఆదేశం
మధ్యప్రదేశ్ నర్మదాపురం డివిజన్ లోని అన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. గోదావరి నది అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గత 5 రోజుల్లో 219.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 455 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది.
కోస్తా కర్ణాటక, మల్నాడు ప్రాంతాల్లో అనేక చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుంగభద్ర నదీ ప్రవాహం తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో హంపిలోని వారసత్వ ప్రదేశాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక తమిళనాడులోని కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఒడిశాలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేసింది.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..