Iran War: ఇరాన్పై దాడి చేయడానికి భారత్ ఓడరేవుల్ని అమెరికా వాడుకుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది, ఇలాంటి ఊహాగానాలను భారత్ తిరస్కరించింది. అమెరికాకు చెందిన వన్ అమెరికా న్యూస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ యుఎస్ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్, ఇరాన్పై తన యుద్ధంలో అమెరికా భారత నావికా స్థావరాలను ఉపయోగించుకుంటోందని అన్నారు.
Read Also: Divorce case: వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు ఇవ్వలేం.. హైకోర్టు కీలక తీర్పు..
ఈ వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. “ఇటువంటి నిరాధారమైన మరియు కల్పిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము” అని అది బుధవారం ఎక్స్లో పోస్ట్ చేసింది.మధ్యప్రాచ్యం వివాదంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలని, తీవ్రతను నివారించాలని, పౌరులకు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
అమెరికా, ఇజ్రాయిల్ శనివారం ఇరాన్పై దాడి చేసి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అప్పటి నుంచి మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఇజ్రాయిల్ తో సహా యూఏఈ, ఖతార్, బహ్రైయిన్, సౌదీ అరేబియా, కువైట్ వంటి అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తోంది. అమెరికా బేస్లను టార్గెట్ చేస్తోంది. మరోవైపు, శ్రీలంక దక్షిణ సముద్ర తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి పేల్చడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది.
