Site icon NTV Telugu

Eric Garcetti: భారతదేశం నా హృదయాన్ని దోచుకుంది.. అమెరికా రాయబారి..

Eric Garcetti

Eric Garcetti

Eric Garcetti: భారతదేశంలో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సిట్టి పదవీ కాలంల మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. గురువారం ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో తన పదవీ కాలాన్ని ‘‘అత్యంత అసాధారణమైనది’’గా అభివర్ణించారు. భారత్ తన హృదయాన్ని దోచుకుందని చెప్పారు. భారత్-అమెరికా మధ్య అంతులేని అవకాశాల ఉన్నాయని అన్నారు. ఇది సరైన సమయంలో సరైన స్థలంలో, సరైన సంబంధాలు ఉండాలని అన్నారు.

‘‘ అధ్యక్షుడు జో బైడెన్ తనకు భారత్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన దేశమని, భవిష్యత్తులో పని చేయాలనుకుంటే, మీరు భారతదేశానికి రావాలని చెప్పారు. ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఇలా అనలేదు’’ అని గార్సెట్టి అన్నారు. ‘‘భారత్-అమెరికా సంబంధాలను నిర్వచించే సంబంధాలు. శాంతిని నెలకొల్పడం అంటే యుద్ధాలు నిరోధించడం. యుద్ధాలు జరకుండా చూడటం. సరిహద్దులు పవిత్రమైనవి, శాంతిని కాపాడటానికి నియమాలు మాత్రమే మార్గం’’ అని అన్నారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్ మరో వివాదాస్పద నిర్ణయం.. భారత్, అమెరికాకు ముప్పు..

రెండు దేశాల సంబంధాలు దృఢంగా ఉండాలని కోరుకుంటూనే, ప్రపంచంలో భారత్ పాత్రను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ రష్యా వివాదంలో శాంతి అయినా, హిందూ మహాసముద్రంలో గస్తీ అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో భారత్ పోషించే పాత్రను చూడం మాకు చాలా ఇష్టమని గార్సెట్టి అన్నారు. ఇది ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని గర్వించదగ్గ భారతదేశమని చెప్పారు.

ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) గురించి అడిగినప్పుడు.. పని మందగించలేదని గార్సెట్టి చెప్పారు. రెండు దేశాల వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడుతూ.. వాణిజ్యంలో న్యాయం జరగాలని అన్నారు. భారతదేశంతో మాకు వాణిజ్య లోటు ఉందని, సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సెమీకండక్టర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు మరియు రక్షణ పరికరాలను కలిసి తయారు చేయగలిగేలా మనం సుంకాలను తగ్గించాలని చెప్పారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానిస్తారా..? అని అడిగిన దానికి గార్సెట్టి మాట్లాడుతూ.. మోడీ, ట్రంప్ సన్నిహితంగా ఉంటారని అన్నారు.

Exit mobile version