Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- వియత్నాం చేతికి బ్రహ్మోస్ క్షిపణి.
- తుది దశలో ఇండోనేషియాతో క్షిపణి కొనుగోలు ఒప్పందం.
- చైనాకు షాక్ ఇస్తున్న భారత రక్షణ అమ్మకాలు.
- మాక్ 3 వేగంతో దూసుకెళ్లే సత్తా బ్రహ్మోస్ సొంతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmos: భారత్ అభివృద్ధి చేసిన ‘‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. పలు దేశాలు ఈ క్షిపణని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్ అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కూడా ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు.
చైనా సమీపంలో ఈ దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీని భారత మిస్సైళ్లతో ఈ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అని చైనా వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలో ఈ కొనుగోళ్లు జరిగాయి. సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో మాట్లాడిన రాజేష్ కుమార్ సింగ్, వియత్నాం ఒప్పందం ఇప్పటికే సంతకం అయ్యిందని, అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఇండోనేషియాతో చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పారు.
Also Read
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
- Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
వియత్నాంతో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ. 5800 కోట్లుగా ఉంటుందని సమాచారం. భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్ను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ముందు 2022లో ఫిలిప్పీన్స్ దాదాపు 375 మిలియన్ డాలర్లతో బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసింది. త్వరలో ఇండోనేషియా కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.
బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ మిస్సైళ్లలో ఒకటి. ఇది మాక్ 3(శబ్ధవేగానికి మూడింతల) వేగంతో ప్రయాణించగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగలం. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ డీల్స్తో చైనాను నేరుగా భారత్ సవాల్ చేస్తోంది. పాకిస్తాన్కు తన ఆయుధాలు ఇచ్చి భారత్పై ఆధిపత్యం చూపించాలనే డ్రాగన్ బుద్ధిని, అదే తరహాలో వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలతో చైనాకు కూడా భారత్ వర్తింప చేస్తోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
-
KTR : నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతావా.. రక్త పిశాచీ.?
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..