Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- వియత్నాం చేతికి బ్రహ్మోస్ క్షిపణి.
- తుది దశలో ఇండోనేషియాతో క్షిపణి కొనుగోలు ఒప్పందం.
- చైనాకు షాక్ ఇస్తున్న భారత రక్షణ అమ్మకాలు.
- మాక్ 3 వేగంతో దూసుకెళ్లే సత్తా బ్రహ్మోస్ సొంతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmos: భారత్ అభివృద్ధి చేసిన ‘‘బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్’’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. పలు దేశాలు ఈ క్షిపణని కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు బ్రహ్మోస్ అమ్మేందుకు ఒప్పందం కుదిరినట్లు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనికి ముందు ఫిలిప్పీన్స్ కూడా ఈ క్షిపణిని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో ఇండోనేషియాతో కూడా ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు.
చైనా సమీపంలో ఈ దేశాలు బ్రహ్మోస్ క్షిపణిపై చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే డ్రాగన్ కంట్రీని భారత మిస్సైళ్లతో ఈ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అని చైనా వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న సమయంలో ఈ కొనుగోళ్లు జరిగాయి. సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో మాట్లాడిన రాజేష్ కుమార్ సింగ్, వియత్నాం ఒప్పందం ఇప్పటికే సంతకం అయ్యిందని, అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఇండోనేషియాతో చర్చలు కూడా చివరి దశలో ఉన్నాయని చెప్పారు.
Also Read
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
వియత్నాంతో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ. 5800 కోట్లుగా ఉంటుందని సమాచారం. భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ వెర్షన్ను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ముందు 2022లో ఫిలిప్పీన్స్ దాదాపు 375 మిలియన్ డాలర్లతో బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసింది. త్వరలో ఇండోనేషియా కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.
బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే క్రూయిజ్ మిస్సైళ్లలో ఒకటి. ఇది మాక్ 3(శబ్ధవేగానికి మూడింతల) వేగంతో ప్రయాణించగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగలం. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ డీల్స్తో చైనాను నేరుగా భారత్ సవాల్ చేస్తోంది. పాకిస్తాన్కు తన ఆయుధాలు ఇచ్చి భారత్పై ఆధిపత్యం చూపించాలనే డ్రాగన్ బుద్ధిని, అదే తరహాలో వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాలతో చైనాకు కూడా భారత్ వర్తింప చేస్తోంది.
తాజావార్తలు
-
Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
-
Sachin Tendulkar: ‘బౌలర్లను అలా చూడలేకపోతున్నా’.. సచిన్ టెండూల్కర్ తీవ్ర ఆవేదన..
-
Upcoming Smartphones: హువావే, లావా, షియోమి, మోటరోలా నుంచి.. జూన్ మొదటి వారంలో విడుదలయ్యే 5G స్మార్ట్ఫోన్స్ ఇవే
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..