INDIA bloc: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. మార్చి 31న ఇండియా కూటమి మెగా ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
Read Also: Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ.. మార్చి 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మార్చి 21న ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా.. రోస్ ఎవెన్యూ కోర్టు అతనికి మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించాయి. ‘‘ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉంది. దేశ ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మహార్యాలీని నిర్వహిస్తాము’’ అని ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.
దేశంలో నియంతృత్వాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోనూ కోపం ఉందని, ప్రతీ ప్రతిపక్ష నాయకుడిపై నకిలీ కేసులు పెట్టడానికి ప్రధాని మోడీ ఒక్కొక్కటిగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ నేత మండిపడ్డారు. మార్చి 3న నిర్వహించే మెగా ర్యాలీ రాజకీయం కాదు, దేశప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి అని ఢిల్లీ ఆప్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!