INDIA bloc: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. మార్చి 31న ఇండియా కూటమి మెగా ర్యాలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
Read Also: Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
Also Read
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ.. మార్చి 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మార్చి 21న ఈడీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా.. రోస్ ఎవెన్యూ కోర్టు అతనికి మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించాయి. ‘‘ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉంది. దేశ ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మహార్యాలీని నిర్వహిస్తాము’’ అని ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.
దేశంలో నియంతృత్వాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోనూ కోపం ఉందని, ప్రతీ ప్రతిపక్ష నాయకుడిపై నకిలీ కేసులు పెట్టడానికి ప్రధాని మోడీ ఒక్కొక్కటిగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ నేత మండిపడ్డారు. మార్చి 3న నిర్వహించే మెగా ర్యాలీ రాజకీయం కాదు, దేశప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి అని ఢిల్లీ ఆప్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!