BJP: 3 రాష్ట్రాల్లో గెలుపు మాదే, తెలంగాణలో… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కేంద్రంమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్(APEC)లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లారు. అయినా కూడా స్వదేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ముందంజలో ఉందని, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఓడిపోతుందని పలు ఒపీనియన్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొనగా.. మిజోరాంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Malreddy Rangareddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తాను విస్తృతంగా పర్యటించానని ఈ రాష్ట్రాల్లో బీజేపీ బాగా పనిచేస్తుందని, రాజస్థాన్ లో ఏకపక్షంగా విజయం సాధిస్తామని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ప్రజలు బీజేపీకి విజయాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పీయూష్ గోయల్ అన్నారు. భారత్ తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితిని చూస్తానని, తెలంగాణలో నవంబర్ 30న ఓటింగ్ ఉంది, అమెరికా వెళ్లకుముందు రెండుసార్లు మాత్రమే తెలంగాణ వెళ్లానని, ఒకసారి పర్యటిస్తే క్షేత్రస్థాయి పరిస్థితి తెలుస్తుందని ఆయన అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
యూఎస్ పర్యటన ముఖ్యంగా టెస్లా టీంని కలవడం కోసమే అని ఆయన అన్నారు. భారత్ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీ)లను స్వీకరిస్తోందని, దాదాపుగా 40 శాతం ద్విచక్ర వాహాలు ఇప్పడు EVలుగా ఉన్నాయని, వాణిజ్య బస్సులు, క్యాబ్ ల కోసం కూడా ఈవీలను ఉపయోగిస్తున్నారని పీయూష్ గోయల్ అన్నారు. రాబోయే 10 ఏళ్లలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా చాలా ఈవీలను కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ ఫలితాలు!
-
Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
-
Hormonal Imbalance in Women: తెలియకుండా చేసే ఈ అలవాట్లు మహిళల హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.. ఈరోజే మార్చుకోండి!
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!