రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్ 23వ తేదీ నుంచి తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారంలో ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్లో జూన్ 21 వరకు.. విదర్భలో 20వ తేదీ వరకు.. తెలంగాణలో జూన్ 19 వరకు, ఛత్తీస్గఢ్లో జూన్ 17 వరకు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల (heat wave) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఈరోజు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. గంగా తీర పశ్చిమ బెంగాల్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరాంలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తూర్పు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్లలో అక్కడక్కడా గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, హర్యానా, విదర్భ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్లలో అక్కడక్కడా గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా, విదర్భలలోని అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి.

