Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?
- వరుడి రైలు ఆలస్యం..
- సకాలంలో ముంబై నుంచి గౌహతి చేరేందుకు రైల్వే సాయం..
- వైరల్ అవుతున్న సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: ముంబైకి చెందిన వరుడు, అస్సాం గౌహతిలోని పెళ్లి వేదికకు చేరుకునేందుకు ఇండియన్ రైల్వే చేసిన సాయం ఇప్పుడు వైరల్గా మారింది. సకాలానికి అతడు వధువుని చేరుకునేలా రైల్వే సాయం చేసింది.
అసలేం జరిగింది..?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ముంబై నుంచి కలకత్తా ప్రయాణిస్తున్న గీతాంజలి ఎక్స్ప్రెస్ హౌరా చేరుకునేందుకు ఆలస్యం కావడంతో పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సరైన సమయానికి వేదిక వద్దకు చేరుకోలేమభని భయపడ్డారు. అయితే, పెళ్లి బృందంలోని ఓ వ్యక్తి రైల్వేస్ ‘ఎక్స్’ హ్యాండిల్లో సందేశం పోస్ట్ చేసిన, సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.
గీతాంజలి ఎక్స్ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 1.05 గంటలకు హౌరా చేరుకోవాల్సి ఉంది. అయితే, రైలు ఆలస్యమైంది. హౌరా నుంచి పెళ్లి బృందం సరైఘాట్ ఎక్స్ప్రెస్ ద్వారా గౌహతి వెళ్లాలి. ఈ ట్రైన్ సాయంత్రం 4.05 గంటలకు అస్సాం బయలుదేరాల్సి ఉంది.
Read Also: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ
ఎక్స్లో చంద్రశేకర్ డి వాఘ్ పోస్ట్ తర్వాత, హౌరా డివిజనల్ రైల్వే మేనేజర్కి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి సందేశం అందినట్లు తూర్పు రైల్వే సీనియర్ అధికారులు చెప్పారు. సరై ఘాట్ ఎక్స్ప్రెస్ బయలుదేరడాన్ని ఆలస్యం చేయడంతో పాటు, గీతాంజలి ఎక్స్ప్రెస్ హౌరాకు వేగంగా వెళ్లేలా చూశారు.
గీతాంజలి ఎక్స్ప్రెస్ సాయంత్రం 4.08 గంటలకు హౌరాకు చేరుకుంది. అప్పటికే అక్కడ ఎదురుచూస్తున్న అధికారులు, ప్లాట్ఫారమ్ పై నుంచి బ్యాటరీ ద్వారా నడిచే వాహనాలను ఉపయోగించి ప్లాట్ఫారమ్ 24 నుంచి సరైఘాట్ ఎక్స్ ప్రెస్ బయలుదేరే ప్లాట్ఫారమ్కి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలు ఆలస్యంగా సరైఘాట్ ఎక్స్ప్రెస్ గౌహతి బయలుదేరింది. దీంతో పెళ్లికొడుకు, అతడి బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
‘‘నా కొడుకు ఐఐటీ గౌహతిలో పీహెచ్డీ చేశాడు. ఆ సమయంలో ఓ అస్సామీ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అందమైన వధువును మా కుటుంబంలోకి ఆహ్వానించేందుకు ముంబై నుంచి వచ్చాం’’ అని పెళ్లికొడుకు తల్లి మంగళ్ వాఘ్ తెలిపారు. కుటుంబం మొత్తం ఇండియన్ రైల్వేకి థాంక్స్ చెప్పింది. రైల్వే సాయం చేయకుంటే సరైన సమయంలో వేదిక వద్దకు చేరుకోలేకపోయేవాళ్లమని చెప్పారు. ఈ పెళ్లి మరాఠీ, అస్సామీ ఆచారాల్లో నిర్వహించినట్లు చెప్పారు.
@RailMinIndia @AshwiniVaishnaw @nerailwaygkp @EasternRailway Need urgent help, we are group of 35 people, travelling via Gitanjali express for my marriage which is delayed by 3.5 hrs, Need to catch Sarighat express at 4:00 pm which seems difficult. Kindly help. My no. 9029597736 pic.twitter.com/a3ULEXHJfs
— Chandu (@chanduwagh21) November 15, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!