American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..
- అమెరికా స్వాతంత్య్రంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరోక్ష పాత్ర..
- ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
American Independence: అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్యాన్ని పొంది 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్రిటన్పై జరిగిన స్వాతంత్ర్య యుద్ధాల తర్వాత విముక్తి అయింది. అయితే, అమెరికా స్వేచ్ఛను పొందడానికి ఒక రకంగా మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఒక కారణం అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఇప్పటికీ అమెరికా వీరిద్దరి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటుంది. వీరు అమెరికా తరుఫున నేరుగా యుద్ధం చేయకున్నా, భారత్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం చాలా ప్రభావం చూపించిందని చరిత్రకారులు భావిస్తుంటారు.
1775లో అమెరికా స్వాతంత్ర్య యుద్ధాలు జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ప్రారంభయమ్యాయి. ఇదే సమయంలో హైదర్ అలీ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం(1780-84) సాగింది. దీంతో బ్రిటన్ ఒకేసారి అటు అమెరికాలో, ఇటు మైసూర్లో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో బ్రిటిష్ సైన్యం, నేవీ అమెరికాపై పూర్థిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయింది. 1780లో పోలిలూర్ యుద్ధంలో హైదర్ అలీ సేనలు బ్రిటిష్ సైన్యాన్ని దారుణంగా ఓడించాయి. మైసూర్ పాలకుల విజయంతో ఆంగ్లేయులపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ అమెరికా విప్లవకారులకు, మైసూరుకు మద్దతు ఇవ్వడంతో బ్రిటిష్ పరిస్థితి క్లిష్టంగా మారింది.
Also Read
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ఆ సమయంలో హైదర్ అలీపై అమెరికాలో చాలా గౌరవం ఉండేది. ఆయన పేరుతో ‘‘హైదర్ అలీ’’ అనే యుద్ధ నౌకను కూడా నిర్మించారు. ఈ నౌక బ్రిటిష్ యుద్ధ నౌకలపై విజయం సాధించడంతో అమెరికాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో అమెరికన్ కవులు హైదర్ అలీని ప్రశంసిస్తూ కవితలు రాశారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
1782లో హైదర్ అలీ మరణంతో రాజ్య బాధ్యతల్ని టిప్పు సుల్తాన్ స్వీకరించారు. ట్రిప్పు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. కొంత కాలం అమెరికన్ పుస్తకాల్లో టిప్పు ప్రస్తావన కూడా ఉండేది. 1799లో శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు మరణించినప్పుడు, అమెరికాలోని మేధావులు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. నిజానికి, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ యుద్ధాలు అమెరికాకు స్వాతంత్య్రాన్ని సాధించపెట్టలేదు కానీ, ఓ రకంగా బ్రిటిష్ వారు తమ శక్తిని పూర్తిగా మైసూర్ యుద్ధంలో కేంద్రీకృతం చేయడంతో అమెరికా స్వాతంత్య్రం సులువైంది. పరోక్షంగా వీరిద్దరు సహకరించినట్లైంది.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!