Karnataka: రాజ్ భవన్కు బాంబు బెదిరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజ్ భవన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎన్ఐఏ అధికారులకు బాంబు హెచ్చరిక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తుతో రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. దీంతో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి 11:30 గంటల సమయంలో ఫోన్ కాల్ రావడంతో అక్కడ తీవ్ర ఆందోళన రేకెత్తించింది. రాజ్ భవన్ ఆవరణపై బాంబు దాడి చేస్తున్నట్టు అజ్ఞాత వ్యక్తి హెచ్చరించాడు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి బాంబు స్క్వాడ్తో అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: Revanth Reddy: ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Also Read
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
బాంబ్ స్క్వాడ్, కే-9 యూనిట్లతో ఘటనా స్థలంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే రాజ్ భవన్ మైదానంలో అధికారులు కూంబింగ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రత కోసం సమగ్ర తనిఖీని కొనసాగించారు. అయితే బాంబు ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను టార్గెట్ చేసుకొని దుండగులు ఈ బాంబు బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ బెదిరింపు కాల్ అధికారులకే రావడంతో వారు బెంగళూరు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సెంట్రల్ డివిజన్ పోలీసులు విధానసౌధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read: TS Ministers: కేసీఆర్ను పరామర్శించిన మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ
తాజావార్తలు
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!