Train Accident: ఉత్తరాఖండ్లో రైల్వే ట్రాక్పై హైటెన్షన్ వైర్.. తప్పిన పెను ప్రమాదం
- ఉత్తరాఖండ్లో తప్పిన పెను ప్రమాదం..
- ఖతిమా రైల్వే స్టేషన్ను సమీపంలో రైల్వే ట్రాక్ పై తెగిపడిన హైటెన్షన్ వైర్..
- హైటెన్షన్ వైర్ ను గుర్తించి రైలును ఆపేసిన డెహ్రాడూన్- తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఖతిమా రైల్వే స్టేషన్ను సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్పై ఉన్న వైర్ను తొలగించడంతో రైలు ముందుకు వెళ్లింది.
Read Also: Diwali Celebration Date Controversy: దీపావళి ఏ రోజు జరుపుకోవాలి..? పంచాంగ కర్తల మధ్య వివాదం..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇక, ఈ విషయానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఉత్తరాఖండ్ పోలీసుల సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఖతిమా స్టేషన్లోని స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ స్టేషన్ నుంచి వెళ్లిన కాసేపటికే లోకో పైలట్లు రైలును నిలిపివేసి.. తమకు సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. తక్షణమే సంఘటన ప్రదేశానికి వెళ్లి ఆ హైటెన్షన్ వైర్ ను తొలగించి ట్రైన్ ముందుకు వెళ్లేలా చేశామన్నారు. అయితే, ఈ ఘటనకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Read Also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలను ఉంచడం వంటి చర్యలు తరచుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్లు అప్రమత్తతో అనేక ప్రమాదాలను నిరోధించగలిగారు. అలాగే, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తాజావార్తలు
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: ప్రేమించిన అమ్మాయినే చంపేశాడు.. లవ్ స్టోరీలో ఇంత షాకింగ్ ట్విస్ట్ ఏంటి?.. ‘గజ’ టీజర్ అదిరిందిగా!
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!