NTV Telugu Site icon

Amrith Bharat Express: రేపే పట్టాలెక్కనున్న అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. గంటకు ఎన్ని కి.మీ ప్రయాణిస్తుందంటే..

Amrit Express

Amrit Express

కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందేభారత్‌కు స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమ్రిత్ ఎక్స్‌ప్రెస్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ప్రారంభోత్సవానికి రంగం అంతా సిద్ధమైంది. రేపు డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయోధ్యలో రేపు లాంచనంగా ఈ రైళ్లను ప్రారంభించననున్నారు. ఇందులో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు సేవలు ప్రయాణిస్తుండగా.. రెండవది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు వరకు ఏపీ మీదుగా ప్రయాణుకులకు సేవలు అందించనుంది. ఈ అమ్రిత్ భారత్ రైళ్లను ప్రత్యేక సదుపాయాలతో ప్రవేశపెడుతున్నారు.

Also Read: YSRCP 2nd List: వైసీపీ రెండో లిస్ట్‌ రెడీ.. 30 నియోజకవర్గాల్లో మార్పులు..? రోజా సేఫ్‌..! అంబటికి నో ఛేంజ్..!

ఇవి గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఈరైళ్లను తీసుకువచ్చినట్టు యూనియన్ రైల్లే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో ‘పుష్-పుల్’ వంటి అడ్వా్న్డ్స్ టెక్నాలజీని కలిగి ఉందని, ఇది రైళ్ల వేగాన్ని, ప్రయాణీకుల సౌకర్యాన్ని గణనీయంగా పెంచుతుందని చెప్పారు. ఈ అమ్రిత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎల్‌ఈడీ లైట్లు, సీసీటీవీలు,పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టిమ్ వంటి ఇరత సౌకర్యాలు కలిగి ఉన్నాయి. రేపు అయోధ్యలో ప్రదానీ జెండా ఊపీ రైళ్లను ప్రారంభించననున్నారు. అనంతరం టెస్ట్ కోసం 4, 5 నెలల పాటు టెస్ట్ రన్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Also Read: Chitradurga shocker: ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు.. అసలేం జరిగిందంటే?