Site icon NTV Telugu

Bomb Threat: గుజరాత్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు..

Bomb Thret

Bomb Thret

Bomb Threat: గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈరోజు (జనవరి 24) తెల్లవారుజామున 4 గంటలకు క్యాంపస్‌ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాల అధికారులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు స్కూల్ కు సెలవు ప్రకటించారు.

Read Also: Meerpet Murder Case: మీర్పేట్లో భార్య హత్య కేసు.. నేడు కోర్టు ముందుకు నిందితుడు!

అయితే, ఈ బాంబు బెదిరింపులపై బాంబు స్క్వాడ్, పోలీసులు ప్రతి చోట క్షుణ్ణంగా గాలిస్తున్నారు. స్కూల్ భవనం మొత్తం శానిటైజ్ చేశారు. మరోవైపు, ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై సైబర్ సెల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా వడోదరలోని సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ సంఘటనలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయమైన బెదిరింపులు లేవని ధృవీకరించారు. కానీ, ప్రజల భద్రత కోసం తాము నిరంతరం అందుబాటులో ఉంటామని తేల్చి చెప్పారు. అలాగే, గతంలో ఢిల్లీలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి పాఠశాలలకు.. వీటిని తాము తేలిగ్గా తీసులేదన్నారు.

Exit mobile version