Gujarat: కోట్లకు వారసురాలు.. అయినా 8 ఏళ్లకే సన్యాసం స్వీకరించింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat diamond merchant’s daughter, 8, gives up life of luxury for monkhood: కోట్ల రూపాయలకు వారసురాలు. వజ్రాల వ్యాపారం, సిరిసంపదల్లో పుట్టిన అమ్మాయి జీవితం సాధారణంగా ఎలా ఉంటుంది. కాలు కందకుండా పెంచుకుంటారు తల్లిదండ్రులు. జీవితాంతం లగ్జరీ లైఫ్ ఉంటుంది. కానీ ఇందుకు భిన్నంగా 8 ఏళ్ల అమ్మాయి మాత్రం చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది. గుజరాత్ వజ్రాల వ్యాపారి కుమార్తె అత్యంత చిన్నవయసులోనే సన్యాసాన్ని స్వీకరించింది.
దేవాన్షి సంఘ్వీ, గుజరాత్ సూరత్ కు చెందిన మల్టీ మిలియనీర్, వజ్రాల వ్యాపారి వారసురాలు గత వారం సన్యాసాన్ని స్వీకరించింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. జైన కమ్యూనిటీకి చెందిన దేవాన్షి సంఘ్వీ అండ్ సన్స్ వజ్రాల వ్యాపారానికి వారసురాలు. 8 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుంది. జైన మతంలో బాల సన్యాసిని కావాలని, అన్ని సుఖాలను త్యజించారు. మంగళవారం ఆమెకు గొప్ప వేడుక నిర్వహించింది కుటుంబం.
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
Read Also: Vemula Prashanth Reddy: ఖమ్మం సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయ్యింది
దేవాన్షి తల్లిదండ్రులు ధమేష్, అమీ సంఘ్వీ అలాగే ఆమె ఐదేళ్ల చెల్లి కావ్య కూడా అందరూ సింపుల్ గా జీవితాలు గడుపుతున్నారని ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తులు వెల్లడించారు. దేవాన్షి ఎప్పుడూ టీవీ, సినిమా చూడలేదని.. రెస్టారెంట్లకు, టూర్లకు వెళ్లలేదని, చివరకు పెళ్లిళ్లకు కూడా హాజరయ్యేది కాదని కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఇప్పటివరకు 367 దీక్షా కార్యక్రమాల్లో పాల్గొందని, గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని ప్రముఖ జైన పుణ్యక్షేత్రమైన పాలిటానాలో ఉపవాసం ఉండేలా చేయడంతో, రెండు సంవత్సరాల వయస్సు నుండి సన్యాసినిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు వెల్లడించారు.
దీక్ష కోసం దేవాన్షి ఇతర సన్యాసులతో కలిసి ఏకంగా 600 కిలోమీటర్లు నడిచింది. దీక్షలో సాధారణంగా ‘‘కేస-లోకా’’ అనే జట్టును తీసేసే ఆచారం ఉంది. ఇది శరీరంపై ఆశ లేదని సూచిస్తుంది. ఆమె జైనమతం మార్గాలను రెండేళ్లలోొ నేర్చుకుంది.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!