Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 35 మంది మృతి..
Gujarat Cable Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నదిలో మునిగిపోయి 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై మొత్తం 500 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 400 మందిని రెస్క్యూ చేయగా.. మరో 100 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. రాజధాని అహ్మదాబాద్ నుంచి ప్రమాద స్థలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Also: T20 World Cup: టీమిండియాకు తొలి దెబ్బ.. దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
Also Read
ఆదివారం కావడంతో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ను సందర్శించేందుకు, నదీ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఐదు రోజుల క్రితమే వంతెనకు మరమ్మతులు చేసి, అధికారులు ప్రజల సందర్శనకు అనుమతించారు. అక్టోబర్ 26న గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కొంతమంది నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలంలో బాధితులు బంధువుల రోదనలు మిన్నంటాయి.
నదిలో పడిన వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని సూచించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి, రాజధాని నుంచి మోర్బీ బయలుదేరారు. ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం తరుపున సీఎం భూపేంద్ర పటేల్ కూడా మరణించిన వారికి రూ. 4లక్షల పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today
PM Modi has sought urgent mobilisation of teams for rescue ops, while Gujarat CM Patel has given instructions to arrange immediate treatment of injured pic.twitter.com/VO8cvJk9TI
— ANI (@ANI) October 30, 2022
Death toll rises to 35 till now in Gujarat's Morbi cable bridge collapse: Gujarat Minister Brijesh Merja pic.twitter.com/iFqfhZ3bKB
— ANI (@ANI) October 30, 2022
తాజావార్తలు
-
Assembly Elections Exit poll 2026: బెంగాల్లో మమత అడ్రస్ గల్లంతు.. కాషాయానిదే గెలుపు..
-
Ask YouTube: యూట్యూబ్ యూజర్లకు సర్ప్రైజ్.. సెర్చ్ బార్లో ఏఐ ఫీచర్ వచ్చేస్తోంది!
-
EPIC Teaser : ఆసక్తి పెంచేలా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టీజర్
-
Egg Pickle Recipe : నాలుకపై నర్తించే రుచి.. ఇంట్లోనే కోడిగుడ్డు పచ్చడి.. తయారీ విధానం ఇలా..!
-
Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!