Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 35 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Cable Bridge Collapse: గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య పెరుగతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో నదిలో మునిగిపోయి 35 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బ్రిడ్జ్ పై మొత్తం 500 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 400 మందిని రెస్క్యూ చేయగా.. మరో 100 మంది గల్లంతు అయినట్లు తెలుస్తోంది. రాజధాని అహ్మదాబాద్ నుంచి ప్రమాద స్థలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Read Also: T20 World Cup: టీమిండియాకు తొలి దెబ్బ.. దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ
Also Read
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
ఆదివారం కావడంతో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ను సందర్శించేందుకు, నదీ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఐదు రోజుల క్రితమే వంతెనకు మరమ్మతులు చేసి, అధికారులు ప్రజల సందర్శనకు అనుమతించారు. అక్టోబర్ 26న గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కేబుల్ బ్రిడ్జ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కొంతమంది నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఘటనా స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలంలో బాధితులు బంధువుల రోదనలు మిన్నంటాయి.
నదిలో పడిన వారి భద్రత కోసం ప్రార్థిస్తున్నట్లు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు భాగం కావాలని సూచించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గుజరాత్ హోం మంత్రి హర్ష్ సఘవి, రాజధాని నుంచి మోర్బీ బయలుదేరారు. ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గుజరాత్ ప్రభుత్వం తరుపున సీఎం భూపేంద్ర పటేల్ కూడా మరణించిన వారికి రూ. 4లక్షల పరిహారాన్ని ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today
PM Modi has sought urgent mobilisation of teams for rescue ops, while Gujarat CM Patel has given instructions to arrange immediate treatment of injured pic.twitter.com/VO8cvJk9TI
— ANI (@ANI) October 30, 2022
Death toll rises to 35 till now in Gujarat's Morbi cable bridge collapse: Gujarat Minister Brijesh Merja pic.twitter.com/iFqfhZ3bKB
— ANI (@ANI) October 30, 2022
తాజావార్తలు
-
Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!