Bhavesh Bhandari: రూ.200 కోట్ల ఆస్తిని కాదని.. సన్యాసం తీసుకున్న కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhavesh Bhandari: గుజరాత్కి చెందిన భార్యభర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి, జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక వేడుకలో భావేష్ భండారీ, అతని భార్య లేష్ దీక్షా తమ సంపద మొత్తాన్ని త్యజించి, సాధారణ జీవితానికి కట్టుబడాలని సన్యాసులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హిమ్మత్ నగర్కి చెందిన నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్న ఈ జంట తమ పిల్లల అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించారు.
భవేష్ భాయ్ భండారీ 19 ఏళ్ల కుమారుడు విశ్వ మరియు 16 ఏళ్ల కుమార్తె భవ్య 2021లో జైన సన్యాసులుగా మారారు. వీరి నుంచి ప్రేరణ పొందిత తాము కూడా సన్యాసత్వాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. వారు భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరడానికి నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 22న ఈ దంపతులు అన్ని కుటుంబ సంబంధాలను తెంచుకోవాలి, భౌతిక వస్తువులకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. దేశమంతటా చెప్పులు లేకుండా, భిక్షతో మాత్రమే వారు జీవించనున్నారు. వారు కేవలం తెల్ల వస్త్రాలను ధరించి, భిక్ష కోసం ఒక గిన్నెను మాత్రమే కలిగి ఉంటారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం

Read Also: Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..!
అపార సంపద కలిగిన భండారీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భండారీ దంపుతు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లను, ఏపీలతో సహా తమ ఆస్తులన్నింటిని విరాళంగా ఇచ్చారు.
జైనమతంలో దీక్ష తీసుకోవడం అనేది ముఖ్యమైన ఆచారం. ఇది వ్యక్తిని భౌతిక సుఖాలకు దూరం చేస్తుంది. గతేడాది గుజరాత్లోని మల్టీ మిలియనీర్ వజ్రాల వ్యాపారి, అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. 2017లో మధ్యప్రదేశ్కి చెందిన ఓ ధనవంతుల కుటుంబం రూ. 100 కోట్లను విరాళంగా ఇచ్చేసి, తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసులుగా మారిన వార్త ప్రముఖంగా నిలిచింది. సుమిత్ రాథోడ్(35), అతని భార్య అనామిక(34) తమ కుమార్తెను వారి తాతయ్య, నానమ్మ దగ్గర వదిలపెట్టి సన్యాసులుగా మారారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!