Bhavesh Bhandari: రూ.200 కోట్ల ఆస్తిని కాదని.. సన్యాసం తీసుకున్న కుటుంబం..
Bhavesh Bhandari: గుజరాత్కి చెందిన భార్యభర్తలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఉన్న రూ. 200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి, జైన సన్యాసులుగా మారేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మోక్షం కోసం యాత్రకు బయలుదేరాలని యోచిస్తున్నారు. ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక వేడుకలో భావేష్ భండారీ, అతని భార్య లేష్ దీక్షా తమ సంపద మొత్తాన్ని త్యజించి, సాధారణ జీవితానికి కట్టుబడాలని సన్యాసులుగా మారుతున్నట్లు ప్రకటించారు. హిమ్మత్ నగర్కి చెందిన నిర్మాణరంగ వ్యాపారంలో ఉన్న ఈ జంట తమ పిల్లల అడుగుజాడల్లో నడుస్తామని ప్రకటించారు.
భవేష్ భాయ్ భండారీ 19 ఏళ్ల కుమారుడు విశ్వ మరియు 16 ఏళ్ల కుమార్తె భవ్య 2021లో జైన సన్యాసులుగా మారారు. వీరి నుంచి ప్రేరణ పొందిత తాము కూడా సన్యాసత్వాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. వారు భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరడానికి నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 22న ఈ దంపతులు అన్ని కుటుంబ సంబంధాలను తెంచుకోవాలి, భౌతిక వస్తువులకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ తీసుకోనున్నారు. దేశమంతటా చెప్పులు లేకుండా, భిక్షతో మాత్రమే వారు జీవించనున్నారు. వారు కేవలం తెల్ల వస్త్రాలను ధరించి, భిక్ష కోసం ఒక గిన్నెను మాత్రమే కలిగి ఉంటారు.
Also Read
- PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు

Read Also: Gidugu RudraRaju: రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి..!
అపార సంపద కలిగిన భండారీ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భండారీ దంపుతు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వారు తమ మొబైల్ ఫోన్లను, ఏపీలతో సహా తమ ఆస్తులన్నింటిని విరాళంగా ఇచ్చారు.
జైనమతంలో దీక్ష తీసుకోవడం అనేది ముఖ్యమైన ఆచారం. ఇది వ్యక్తిని భౌతిక సుఖాలకు దూరం చేస్తుంది. గతేడాది గుజరాత్లోని మల్టీ మిలియనీర్ వజ్రాల వ్యాపారి, అతని భార్య, 12 ఏళ్ల కుమారుడు సన్యాసం స్వీకరించారు. 2017లో మధ్యప్రదేశ్కి చెందిన ఓ ధనవంతుల కుటుంబం రూ. 100 కోట్లను విరాళంగా ఇచ్చేసి, తమ మూడేళ్ల కుమార్తెను వదిలి సన్యాసులుగా మారిన వార్త ప్రముఖంగా నిలిచింది. సుమిత్ రాథోడ్(35), అతని భార్య అనామిక(34) తమ కుమార్తెను వారి తాతయ్య, నానమ్మ దగ్గర వదిలపెట్టి సన్యాసులుగా మారారు.
తాజావార్తలు
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో