Site icon NTV Telugu

మహిళలకు షాక్‌…మళ్లీ పెరిగిన పసిడి ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గ‌త రెండు రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధ‌ర‌లు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గు ముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 43,700 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగి రూ. 47,680 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ.200 పెరిగి 67,300 కు చేరుకుంది.

Exit mobile version