Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimony: దేశంలో రోజు రోజుకి మ్యా్ట్రిమోనీయల్ మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనీయల్ సైట్స్ లో ఉన్న వారితో పరిచయాలు చేసుకోవడం.. వారితో స్నేహంగా నటించడం.. తరువాత వారి నుంచి డబ్బు వసూలు చేయడం. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిలో యువ వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎక్కువగా మోసపోతున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్స్ లో పరిచయమైన ఒక అమ్మాయితో ఎన్ఆర్ఐ టెక్కీ స్నేహం చేశాడు. పరిచయమైన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. నిజమేనని టెక్కీ నమ్మాడు. ఇంకేముంది తనకు కొంత అమౌంట్ కావాలని కొద్ది రోజుల తరువాత అడిగింది. అడిగింది తక్కువ అమౌంటేనని పంపాడు. తరువాత పరిచయం పెరిగి నిత్యం ఫోన్లో మాట్లాడుకోసాగారు. ఒకరోజు అతడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది. వీడియోకాల్ రికార్డు చేసిన యువతి.. అతన్ని బ్లాక్మెయిల్ చేసి రూ. కోటి లాగేసింది..
Read also: Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?
Also Read
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
బెంగళూరులోని ఆర్కే పురానికి చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడు. ట్రైనింగ్ కోసమని బెంగళూరుకు వచ్చాడు. ఈ సమయంలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీలో రిజిస్టర్ అయ్యాడు. సైట్లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. నిత్యం ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడంటూ.. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని చెప్పడంతో అతను నిజమేనని విశ్వసించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లేందుకు రూ. 1500లను అప్పుగా ఇవ్వమంటూ ఒక రోజు అతడికి ఫోన్ చేసింది. ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలోనే అతడికి తెలియకుండా అదంతా రికార్డు చేసింది. అనంతరం ఆ క్లిపింగ్ను అతడికి షేర్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ.. బెదిరించడం ప్రారంభించింది. అలా రూ. కోటికి పైగా కాజేసింది. యువతి వేధింపులు తాళలేక బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆమె రూ. 30 లక్షలు వినియోగించింది. అతడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను స్తంభింపజేశాం. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు జరపకూడదు. మీకు వచ్చే ఫేక్ కాల్స్ను నమ్మకండి’’ అంటూ డీసీపీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..