Matrimony: పెళ్లి చేసుకుంటానంది.. రూ. కోటి కాజేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimony: దేశంలో రోజు రోజుకి మ్యా్ట్రిమోనీయల్ మోసాలు పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనీయల్ సైట్స్ లో ఉన్న వారితో పరిచయాలు చేసుకోవడం.. వారితో స్నేహంగా నటించడం.. తరువాత వారి నుంచి డబ్బు వసూలు చేయడం. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిలో యువ వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఎక్కువగా మోసపోతున్నారు. మ్యాట్రిమోనియల్ సైట్స్ లో పరిచయమైన ఒక అమ్మాయితో ఎన్ఆర్ఐ టెక్కీ స్నేహం చేశాడు. పరిచయమైన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. నిజమేనని టెక్కీ నమ్మాడు. ఇంకేముంది తనకు కొంత అమౌంట్ కావాలని కొద్ది రోజుల తరువాత అడిగింది. అడిగింది తక్కువ అమౌంటేనని పంపాడు. తరువాత పరిచయం పెరిగి నిత్యం ఫోన్లో మాట్లాడుకోసాగారు. ఒకరోజు అతడికి నగ్నంగా వీడియో కాల్ చేసింది. వీడియోకాల్ రికార్డు చేసిన యువతి.. అతన్ని బ్లాక్మెయిల్ చేసి రూ. కోటి లాగేసింది..
Read also: Manchu Vishnu: మా ప్రెసిడెంట్ కీలక నిర్ణయం.. అది చేయలేకనేనా.. ?
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
బెంగళూరులోని ఆర్కే పురానికి చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నాడు. ట్రైనింగ్ కోసమని బెంగళూరుకు వచ్చాడు. ఈ సమయంలోనే మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీలో రిజిస్టర్ అయ్యాడు. సైట్లో ఒక యువతితో పరిచయం ఏర్పడింది. నిత్యం ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తన తండ్రి చనిపోయాడంటూ.. ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నానని చెప్పడంతో అతను నిజమేనని విశ్వసించాడు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వెళ్లేందుకు రూ. 1500లను అప్పుగా ఇవ్వమంటూ ఒక రోజు అతడికి ఫోన్ చేసింది. ఆమె మాటలు నమ్మి డబ్బు పంపించాడు. రెండు రోజుల తర్వాత నగ్నంగా అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఈ క్రమంలోనే అతడికి తెలియకుండా అదంతా రికార్డు చేసింది. అనంతరం ఆ క్లిపింగ్ను అతడికి షేర్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానంటూ.. బెదిరించడం ప్రారంభించింది. అలా రూ. కోటికి పైగా కాజేసింది. యువతి వేధింపులు తాళలేక బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలను గుర్తించి స్తంభింపజేశారు. ఆ విధంగా రూ. 84 లక్షలను ఆమె వినియోగించడానికి వీలు లేకుండా చేశారు. ‘‘ఇప్పటి వరకు ఆమె రూ. 30 లక్షలు వినియోగించింది. అతడి ఫిర్యాదుతో ఆమె ఖాతాను స్తంభింపజేశాం. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ లావాదేవీలు జరపకూడదు. మీకు వచ్చే ఫేక్ కాల్స్ను నమ్మకండి’’ అంటూ డీసీపీ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!